ఉక్రెయిన్ లో కార్గొ నౌకపై దాడి- నలుగురు ఇండియన్స్ మృతి

ఉక్రెయిన్ లోని ఓడెస్సా తీరం నుంచి బయల్దేరిన కమర్షియల్ నౌకపై దాడి జరిగి నలుగురు ఇండియన్స్ చనిపోగా, మరొకరి పరిస్థితి క్రిటికల్ గా ఉంది. గినియా బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో మొత్తం 17 మంది ఉండగా దాడి జరిగినప్పుడు నలుగురు ఇండియన్స్ మృ తి చెందారు. ఈ ఘటనపై కేంద్రం విచారం ప్రకటించింది. మృతుల వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాద్యత ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఉందని మన విదేశాంగ శాఖ ఎత్తి పొడిచింది.


