‘అంధభక్తులు’ కాదు.. ప్రశ్నించే విద్యార్థులు కావాలి: రాహుల్

మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ ప్రోగ్రాంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. పేపర్ లీక్స్, జాబ్ రిక్రూట్మెంట్ లేట్ అవడం, ఖాళీ పోస్టులు, స్కాలర్షిప్లు అందకపోవడం వంటి సమస్యలను స్టూడెంట్స్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు ప్రశ్నలు అడిగే స్వభావం కలవారని, కానీ వ్యవస్థకు ప్రశ్నించేవారు కాకుండా ‘అంధభక్తులు’ కావాలని ఉందని రాహుల్ గాంధీ అన్నారు. చదువు ప్రతి విద్యార్థి హక్కు అని ఆయన స్పష్టం చేశారు.


