స్వగ్రామానికి చేరుకున్న శంకర్ గౌడ్ మృతదేహం
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55) మృతదేహం ఆయన స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక వాహనంలో తరలించారు. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. శంకర్ గౌడ్ ఆత్మహత్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ బంద్ కు పిలుపునిచ్చింది.



