← Back to news

తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

By DK· 25 Jul 2026· రంగారెడ్డి జిల్లా
తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

TG: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మొండి గౌరెల్లి గ్రామంలో అసైన్డ్ భూముల సేకరణపై రైతులు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ సర్పంచ్ కొలన్ రమాదేవి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. 677 ఎకరాలకు సర్వే చేసిన అధికారులు భూపరిహారంపై స్పష్టత ఇవ్వడం లేదని ఫైరయ్యారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నకిలీలను ఏరి వేయకుండా అధికారులు ముందుకు వెళుతున్నారని ఆరోపించారు. నకిలీ లబ్ధిదారులను తొలగించి, భూ నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More in TG