ఏపీ జిల్లాలకు వర్షం హెచ్చరిక

AP: రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్లో రేపు(మంగళశారం) వర్షాలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల మార్పు వల్ల తీరప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు పిడుగుల సమయంలో చెట్లు, కరెంట్ స్తంభాల కింద నిలబడకూడదని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.



