← Back to news

వాష్‌రూమ్ గ్రిల్స్ పగులగొట్టి.. లాకర్ ఖాళీ చేసి

By DK· 20 Jul 2026· హైదరాబాద్
వాష్‌రూమ్ గ్రిల్స్ పగులగొట్టి.. లాకర్ ఖాళీ చేసి

TG: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని గురుకృప ఎక్స్‌పోర్ట్స్ ఆఫీస్‌లో జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. రాత్రి దుండగులు వాష్‌రూమ్ గ్రిల్స్ పగులగొట్టి లోపలికి ప్రవేశించి, లాకర్‌లో భద్రపరిచిన కిలోకు పైగా బంగారు ఆభరణాలను అపహరించారు. సూరత్‌కు చెందిన ఓ జ్యువెలరీ వ్యాపారి బంజారాహిల్స్‌లోని ఈ ఎక్స్‌పోర్టు కార్యాలయ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు. డైమండ్ ఫిక్సింగ్ కోసం సిద్ధంగా ఉంచిన 7 నెక్లెస్‌లు, 7జతల విలువైన చెవిపోగులను దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 15h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.