వాష్రూమ్ గ్రిల్స్ పగులగొట్టి.. లాకర్ ఖాళీ చేసి

TG: హైదరాబాద్ బంజారాహిల్స్లోని గురుకృప ఎక్స్పోర్ట్స్ ఆఫీస్లో జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. రాత్రి దుండగులు వాష్రూమ్ గ్రిల్స్ పగులగొట్టి లోపలికి ప్రవేశించి, లాకర్లో భద్రపరిచిన కిలోకు పైగా బంగారు ఆభరణాలను అపహరించారు. సూరత్కు చెందిన ఓ జ్యువెలరీ వ్యాపారి బంజారాహిల్స్లోని ఈ ఎక్స్పోర్టు కార్యాలయ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు. డైమండ్ ఫిక్సింగ్ కోసం సిద్ధంగా ఉంచిన 7 నెక్లెస్లు, 7జతల విలువైన చెవిపోగులను దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



