← Back to news

విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: KTR

By dk· 3 Aug 2026
విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: KTR

TG: ఇంజినీరింగ్ విద్యార్థులను "క్రిమినల్ వేస్ట్" అని CM రేవంత్ రెడ్డి అనడం సరికాదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిన ఆయన, CM వ్యాఖ్యలను ఖండించకుండా మౌనం పాటిస్తే వాటిని సమర్థించినట్టేనని పేర్కొన్నారు. యువత రేపటి భారత నిర్మాణంలో కీలకమని, విద్యార్థులను అవమానించే వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు యువత మనోభావాలను దెబ్బతీస్తోందని విమర్శించారు.

More in Politics