గచ్చిబౌలి చోరీ కేసులో నిందితులు అరెస్ట్

TG: గచ్చిబౌలి పరిధిలో ఉన్న హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటోన్న ఓ వ్యాపారి ఇంట్లో బంగారు నగలు, వజ్రాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. యూపీ పోలీసుల సహకారంతో తీవ్రంగా గాలించి నిందితులను పట్టుకున్నారు. కిలో బంగారు నగలు, వజ్రాలను ఎత్తుకెళ్లిన నేపాలీ దంపతులను అరెస్ట్ చేశారు. వీరిని వ్యాపారి నెలరోజుల క్రితమే పనిలో పెట్టుకోగా.. ఇటీవలే వ్యాపారి కుటుంబం ఓ పనినిమిత్తం ముంబాయికి వెళ్లింది. వారు తిరిగివచ్చే సరికి ఇంట్లోని నగలు, వజ్రాలు కనిపించకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు.



