← Back to news

డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం: నలుగురి అరెస్ట్

By Subhash· 21 Aug 2026· Gov· Delhi
డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం: నలుగురి అరెస్ట్

ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు 'డిజిటల్ అరెస్ట్' పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర సైబర్ ముఠాను ఛేదించి, పంజాబ్, రాజస్థాన్‌లలో నలుగురిని అరెస్ట్ చేశారు. ఒక రిటైర్డ్ ఆర్మీ కల్నల్ నుండి రూ. 15 లక్షలకు పైగా నక్కేసిన కేసులో ఈ చర్యలు తీసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా బ్యాంక్ ఖాతాలను సేకరించి, కంబోడియా, యుఏఈల్లోని సైబర్ నేరగాళ్లకు అందించినట్లు నిందితులు అంగీకరించారు. ఈ ఖాతాకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల లావాదేవీలతో కూడిన 17 ఫిర్యాదులు నమోదు అయ్యాయి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 4h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.