← Back to news

భారీ భూస్కామ్.. బోర్డు తీసేసి రియల్టర్ దందా

By DK· 7 Jul 2026· R
భారీ భూస్కామ్.. బోర్డు తీసేసి రియల్టర్ దందా

TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూర్‌లోని 40 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని గతంలో ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూమిని అమ్మడం, కొనడం నేరం. అయితే అసైనీల వద్ద ఉండాల్సిన భూమిలో 12 ఎకరాలు ఇటీవల ఓ రియల్టర్ చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ ప్రభుత్వ భూమి అనే పెద్ద నోటీసు బోర్డు కూడా ఉండేది. ఇటీవల బోర్డు తీసేసి పట్టా భూమిగా మార్చేశారు. రూ.200 కోట్ల విలువైన భారీ భూకుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.

More in TG