← Back to news

విద్యుత్ సమస్యపై ఫోన్ చేసినా స్పందన కరువు

By Kamal Kumar· 24 Aug 2026
విద్యుత్ సమస్యపై ఫోన్ చేసినా స్పందన కరువు

TG: రాత్రంతా కరెంట్ లేదు.. ఫోన్ చేసినా ఏఈ స్పందించలేదంటూ ఎక్మాయి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు విద్యుత్ లేక దోమల బెడదతో అవస్థలు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. విద్యుత్ సమస్యపై సంబంధిత ఏఈ, ఓపీ అధికారికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. అత్యవసర సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

More in Local