← Back to news

పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపిన పిల్లలు.. చివరికీ

By DK· 8 Jun 2026· Dishadaily· హైదరాబాద్‌
పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపిన పిల్లలు.. చివరికీ

TG: మల్కాజిగిరి PS పరిధి మౌలాలి RTC కాలనీకి చెందిన మారుతి సుతార్ రైల్వేఉద్యోగి. అతని పెన్షన్ బెనిఫిట్స్‌పై కన్నేసిన భార్య గంగాభాయి, కొడుకు కిషన్ సుతార్, కూతురు ప్రాపుల్లా మర్డర్‌కు ప్లాన్ చేశారు. మారుతి సుతార్‌కు విషాన్ని అన్నంలో కలిపి పెట్టడంతో మరణించాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని మాయం చేసేందుకు ముక్కలు ముక్కలుగా చేసి బకెట్‌లో వేస్తుండగా తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలు నిరూపణ కావడంతో కోర్టు కిషన్ సుతార్(47), ప్రాపుల్లా(36)లకు ఉరిశిక్ష, గంగాభాయి(65)కు జీవితఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.