సైబర్ మోసాల్లో మహిళ బ్యాంక్ అకౌంట్..భయంతో ఆత్మహత్య

థానే జిల్లా డొంబివలి(తూర్పు) సైరామ్ సొసైటీలో దేవికా అర్ముగం పండరం(38) సూసైడ్ చేసుకున్నారు. ఆమె బ్యాంక్ అకౌంట్ను సైబర్ మోసాల్లో వాడారని రాజస్థాన్లోని చురు పోలీసులు ఆగస్టు 8న ఆమె ఇంటికి వచ్చి నోటీసు ఇచ్చారు. దీనిపై క్లారిటీ కోసం ఆమె థానే పోలీస్ కమిషనరేట్లోని సైబర్ క్రైమ్ విభాగానికి వెళ్లారు. అక్కడ హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల్లో ఆమెపై సైబర్ మోసం కేసులున్నాయని చెప్పారు. దీంతో భయపడ్డ ఆమె బ్లేడ్తో చేయి, గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.



