దొంగ బంగారం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు

TG: దొంగతనాల ద్వారా వచ్చిన బంగారాన్ని కొనుగోలు చేస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. చోరీలకు పాల్పడే వ్యక్తులు దోచుకున్న బంగారాన్ని తక్కువ ధరకు విక్రయించి నగదుగా మార్చుకునే అవకాశం ఉందన్నారు. జ్యుయెలరీ షాపుల యజమానులు తక్కువ ధరకు బంగారం విక్రయించేందుకు ఎవరైనా తీసుకొస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న బంగారం విషయంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించి దర్యాప్తునకు సహకరించాలని డీసీపీ కోరారు.

