ఇందిరమ్మ ఇంటికి మంత్రి గృహప్రవేశం

TG: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటిని ప్రారంభించి కుటుంబ సభ్యులను అభినందించారు. పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.



