ఎన్నికల వరకే రాజకీయాలు

TG: రాజకీయాలను కేవలం ఎన్నికల సమయానికి మాత్రమే పరిమితం చేయాలని, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదని CM రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. CM ఢిల్లీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, నితిన్ గడ్కరీలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వరంగల్, ఆదిలాబాద్ విమనాశ్రయాల నిర్మాణ పనులు ప్రారంభం, మెట్రో, RRR తదితర అంశాలపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.



