బైక్పై ఇంటింటికీ వెళ్లి చెక్కులిచ్చిన టీడీపీ నేత!

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో అనారోగ్యంతో చికిత్స పొందిన 45 మందికి రూ.38.46 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఆయన బైక్పై వెళ్లి ఇంటింటికీ చెక్కులు అందించి, లబ్ధిదారులకు భరోసా కల్పించారు. ఆపదలో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు.



