← Back to news

నిధులు లేక పల్లెల్లో అభివృద్ధికి బ్రేక్

By DK· 9 Jul 2026
నిధులు లేక పల్లెల్లో అభివృద్ధికి బ్రేక్

TG: రాష్ట్రంలో కొత్త పాలకమండళ్లు ఏర్పడి ఆరునెలలు దాటినా గ్రామ పంచాయతీల్లో సమస్యలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. గత పాలకవర్గాల కాలానికి సంబంధించి సుమారు రూ.500 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఇంకా రాకపోవడం, 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కాకపోవడంతో పాలన కష్టంగా మారింది. నిధుల కొరతతో అత్యవసరమైన పనులూ చేపట్టలేని పరిస్థితి నెలకుంది. ప్రజారోగ్యానికి గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, సర్పంచులు సొంత నిధుల నుంచి ఖర్చు చేసినా పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. దీంతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది.

More in TG