గుండె సమస్యతో బాధపడుతున్న మహిళకు రూ.5 లక్షల LOC

TG : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పరిధిలోని ఇంద్రవెల్లి బుద్దనగర్కు చెందిన కాంబ్లే జయశ్రీ గుండె సమస్యతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెప్పడంతో, ఇంద్రవెల్లి టౌన్ ప్రెసిడెంట్ జితేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తెలుసుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షల LOC ని మంజూరు చేయించారు. ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కును బాధితురాలి కుటుంబసభ్యులకు అందించారు.



