← Back to news

ప్రైవేట్ పార్ట్స్‌కు కరెంట్ షాక్ ఇచ్చి భర్త హత్య

By విశీ· 13 Aug 2026· Indiatimes
ప్రైవేట్ పార్ట్స్‌కు కరెంట్ షాక్ ఇచ్చి భర్త హత్య

దిల్లీలోని రతియా మార్గ్‌లో మున్నాలాల్(55)ను అతని భార్య మంజూ, ఆమె ప్రియుడు చమన్ కలిసి హత్య చేశారు. దొంగలు చోరీ చేయడానికి వచ్చి హత్య చేసినట్టు పోలీసులు అనుమానించారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షల్లో మాత్రం మందు ఇచ్చి, గొంతు కోసి, తల, ముఖం మీద దెబ్బలు కొట్టి, ప్రైవేట్ భాగాలపై విద్యుత్ షాక్ ఇచ్చి చంపినట్లు తేలింది. సీసీ కెమెరా ఫుటేజీ చూడటంతో నిజం బయటపడింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 6h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.