← Back to news

ఊరు ఒక్కటే.. మండలాలు మాత్రం మూడు

By prabhakar kodepaka· 2d ago· Hanumakonda
ఊరు ఒక్కటే.. మండలాలు మాత్రం మూడు

TG: హనుమకొండ జిల్లా వెంకటేశ్వర్లపల్లి గ్రామస్థులు మూడు మండలాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాల పునర్విభజనకు ముందు వరంగల్ జిల్లా పరకాల మండలంలో ఉన్న ఈ గ్రామాన్ని అనంతరం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో చేర్చారు. కొత్తగా నడికుడ మండలం ఏర్పడిన తర్వాత గ్రామాన్ని ఆ మండలంలో విలీనం చేశారు. దీంతో రెవెన్యూ పనులకు నడికుడ, పరిపాలనా అవసరాలకు కమలాపూర్, శాంతిభద్రతల వ్యవహారాలకు పరకాల మండలాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయని అన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 9h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.