కుటుంబాన్ని బంధించి 66 తులాల బంగారం చోరీ

TG: కరీంనగర్లో మంగళవారం అర్ధరాత్రి భారీ దోపిడీ ఘటన కలకలం రేపింది. భగత్ నగర్కు చెందిన వృద్ధుడు అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బంధించి, తుపాకులు, కత్తులతో బెదిరించి 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు, 10 తులాల వెండిని దోచుకెళ్లారు. అరుపులు వినపడకుండా TV సౌండ్ పెట్టి బాధితులను తీవ్రంగా కొట్టి గదిలో బంధించారు. మొబైల్ ఫోన్లు తీసుకెళ్లిన దుండగులు కింద పార్కింగ్లో ఉన్న రెండు బైకులను కూడా దొంగిలించి వేములవాడ బైపాస్ వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.



