శవంపై బంగారు కమ్మలు మాయం!

జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో మానవత్వం మంటగలిసింది. అనారోగ్యంతో చనిపోయిన 80 ఏళ్ల బాలవ్వ అనే వృద్ధురాలి చెవులకు ఉన్న బంగారు కమ్మలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. డెడ్ బాడిని ఇంటికి తీసుకెళ్లాక నగలు లేకపోవడాన్ని గమనించిన చుట్టాలు షాక్ అయ్యారు. హాస్పిటల్లోని సెక్యూరిటీ గార్డ్ ని నిలదీయగా తనకు తెలియదని చెప్పడంతో, బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.



