ప్రభుత్వ బడులపై నిర్లక్ష్యం.. జానపద గేయంతో నిరసన
TG: తెలంగాణలో ప్రభుత్వ బడులు వసతులు లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ బస్ యాత్రలో జానపద గాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. భవనాలు శిథిలావస్థకు చేరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, కంప్యూటర్ విద్య అవసరమని, అలాంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారని జానపద గేయం ద్వారా నిరసన తెలిపారు.



