గంగాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. ఎమ్మెల్యే హాజర్!

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురం గ్రామంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండ గిరి ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సర్పంచ్, మండల అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



