← Back to news

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి: చంద్రబాబు

By Mahesh· 28 Jul 2026
ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి: చంద్రబాబు

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ మార్పులపై రైతుల్లో అవగాహన కల్పించడంపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రం నుంచి ఆయా శాఖలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More in News