రైలు నుంచి దొంగను తోసేసిన ప్రయాణికుడు
రాయ్పూర్ జిల్లా మాంధర్-ఉర్కురా మధ్య ఆజాద్ హింద్ ఎక్స్ప్రెస్లో ఓ దొంగ ప్రయాణికుడి పర్సు కొట్టేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కోచ్ అటెండెంట్లు అతడిని పట్టుకునే క్రమంలో దొంగ రైలు తలుపు మెట్లు పట్టుకుని వేలాడాడు. ఆ టైంలో రూర్కెలాకు చెందిన ప్రయాణికుడు కె.ఆర్.సురేష్ కుమార్ అతన్ని కాలితో తన్నడంతో ఆ యువకుడు కింద పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో GRP పోలీసులు సురేష్ కుమార్పై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరైన ఆయన బెయిల్పై విడుదలయ్యారు. పడిపోయిన దొంగ కోసం పోలీసులు వెతుకుతున్నారు.



