← Back to news

అర్ధరాత్రి పేదల గుడిసెల కూల్చివేత

By venkatrao· 24 Aug 2026· Mandapeta
అర్ధరాత్రి పేదల గుడిసెల కూల్చివేత

గోదావరి జిల్లా మండపేటలో పేదలు వేసుకున్న గుడిసెలను అర్ధరాత్రి వేళ పోలీసులు, మున్సిపల్ అధికారులు కూల్చివేయడం దారుణమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. ఇది ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అరాచక పాలనకు సాక్ష్యమని విమర్శించారు. గోదావరి పుష్కరాల పేరు చెప్పి, ఏళ్ల తరబడి నివాసముంటున్న పేదలను రోడ్డున పడేయడం ఏంటని ప్రశ్నించారు. బాధితులకు కేటాయించిన టిడ్కో ఇళ్లలో తాగునీరు సహా కనీస వసతులు లేవని తెలిపారు. అధికారులంతా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని, అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేయడం మానాలని హెచ్చరించారు.

More in Local