← Back to news

నవీపేట్‌ మండలంలో దొంగల బీభత్సం

By డీకే· 16 Jun 2026· Hmtvlive· నిజామాబాద్ జిల్లా
నవీపేట్‌ మండలంలో దొంగల బీభత్సం

TG: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని కోస్లీలో వ్యవసాయ బోరు బావుల వద్ద కేబుల్ వైర్లను దొంగలు చోరీ చేశారు. రాత్రి వేళలో దొంగలు కోస్లీ గ్రామ శివారులోని సుమారు 20వ్యవసాయ బోరు బావుల వద్ద ప్యానెల్ బాక్స్‌లను ధ్వంసం చేసి కేబుల్ వైర్లను దొంగిలించారు. కోస్లీ గ్రామంతోపాటు ఫకిరాబాద్ తదితర ప్రాంతాల్లో పేకాట రాయుళ్ల ఆగడాలు అధికమవ్వడంతో చోరీలు జరుగుతునయని రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.