← Back to news

తమిళనాడు పాస్టర్‌కు నాలుగు మరణశిక్షలు

By Subhash· 21 Aug 2026· Indiatimes· Tirunalveli
తమిళనాడు పాస్టర్‌కు నాలుగు మరణశిక్షలు

తమిళనాడులోని తిరునెల్వేలి POCSO స్పెషల్ కోర్టు ఒక ఘోరమైన కేసులో బిగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. 2022లో సమ్మర్ మోరల్ క్లాసెస్ పేరుతో నలుగురు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన S. అబ్రహం (47) అనే పాస్టర్‌కు కోర్టు ఏకంగా నాలుగు మరణశిక్షలు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో పాటు అతనికి ₹52,000 జరిమానా విధించింది. బాధిత బాలికలకు ఒక్కొక్కరికి ₹10 లక్షల చొప్పున పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 4h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.