Latest

బర్త్డే పేరుతో NRI కిడ్నాప్
AP : బర్త్డే గ్రాండ్గా చేద్దామని బ్రిటన్ నుంచి రప్పించి, ఒక NRIని స్నేహితులే కిడ్నాప్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన సుమంత్ అనే యువకుడిని తిరుపతి, హైదరాబాద్లలో బంధించి, అతడి టెలిగ్రామ్ ఛానెల్ అమ్మేసి రూ.1.94 కోట్లు తీసుకున్నారు. సుమంత్ తన గర్ల్ఫ్రెండ్కి మెసేజ్ చేయడంతో సైబరాబాద్ పోలీసులు ఫ్లాట్పై దాడి చేసి రక్షించారు. తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని (బాలాజీ, చరణ్, వాజిద్ బాషాలను) అరెస్ట్ చేశారు.

ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోంది
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల బీజేపీ మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలును విస్మరించిందని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, విద్యా భరోసా, BC, SC, STలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా 1000 రోజుల పాలన అంటూ సంబరాలు చేసుకోవడం దుర్మార్గమన్నారు.

జాబ్ మారేటప్పుడు.. EPFO చెక్ చేసుకోండి!
Job మారే టైంలో ఈపీఎఫ్వో(EPFO) రూల్స్పై ఎంప్లాయిస్ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొత్త కంపెనీలో చేరే ముందు UAN యాక్టివ్గా ఉందో లేదో సరిచూసుకోవడంతోపాటు Bank, PAN వివరాలు అప్డేట్ అయ్యాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. పాత కంపెనీకి సంబంధించిన 'Date of exit ' నమోదైతేనే పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. కొత్త జాబ్లో చేరాక పాత నిధులను కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల పెన్షన్ సర్వీస్ కంటిన్యూటీతోపాటు వడ్డీ నష్టం జరగకుండా ఉంటుంది.

అసెంబ్లీలో మా సమస్యలు చర్చించండి
TG: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని తెలంగాణ మెడికల్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కోరారు. శుక్రవారం చిట్యాల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించాలని, లేదా Direct Benefit Transfer ద్వారా నేరుగా వేతనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

CM ప్రకటనలు చూస్తే తుగ్లక్ కూడా సిగ్గుపడతాడు: కవిత
TG: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు చూస్తుంటే తుగ్లక్ కూడా సిగ్గుపడతాడని తెలంగాణ రక్షణ సేన నేత కవిత హాట్ కామెంట్స్ చేశారు. CM అనౌన్స్మెంట్స్కి, Govt. డిపార్ట్మెంట్స్ డెసిషన్స్కి పొంతన లేకుండా పోయిందన్నారు. ఇంటర్ అడ్మిషన్లు ఈ ఏడాది నుంచి ఉండవని CM చెబుతుంటే.. రెండు రోజుల్లో అడ్మిషన్లు అంటూ ఇంటర్ బోర్డు ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రంలోని మేధావులు, స్టేక్హోల్డర్స్తో చర్చించాలని సూచించారు. అలా చేస్తేనే డిగ్నిటీ ఉన్న నాయకుడిగా సీఎం నిలుస్తారని అన్నారు.

‘మీ కోసమే తీస్తున్నాం’.. మేకర్స్ కామెంట్స్పై తాప్సీ ఫైర్!
‘పెద్ది’, ‘టాక్సిక్’ లాంటి సినిమాల్లో హీరోయిన్లను అభ్యంతరకరంగా చూపించడంపై నటి తాప్సీ మాట్లాడారు. ‘ఆడియన్స్ ఇదే చూస్తున్నారు’ అంటూ మేకర్స్ తప్పును జనాలపై నెట్టేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేవలం కలెక్షన్ల కోసమే చూస్తూ కంటెంట్ను పక్కన పెట్టేస్తున్నారని అన్నారు. జనాలు సపోర్ట్ చేస్తేనే మార్పు వస్తుందని, ఒకవైపు ట్రోల్ చేస్తూనే ఇంకోవైపు ఆ సీన్లను కట్ చేసి వైరల్ చేసే బ్యాచ్ కూడా ఉందని తాప్సీ తెలిపారు.

అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన
AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయ గోశాలలో గోవులకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిత్యకళ్యాణ మండపంలో సుమారు 1,500 మంది ముత్తైదువులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని పూజించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ చుంచు రమేష్బాబు, సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మేళ్లగూడలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన
TG: ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్రెడ్డి ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం మేళ్లగూడలో నిర్వహించిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందితే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి నాయక్తో పాటు పలువురు పాల్గొన్నారు.

SIR న్యాయబద్ధం కాదు: అశోక్ లవాసా
Election Commission చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్ అశోక్ లవాసా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు చట్టం పేరుతో ‘బలవంతుడిదే రాజ్యం’(Might is right) అన్నట్లుగా ఉన్నాయని విమర్శించారు. చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, దాని స్ఫూర్తిని కాపాడటం ముఖ్యమన్నారు. ఓటర్ల జాబితా నుంచి 13 కోట్ల మంది పేర్లను తొలగించడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. ఇది న్యాయబద్ధంగా లేదని, దీని వల్ల ప్రజలకు ప్రజాస్వామ్యంపైనే నమ్మకం పోయే ప్రమాదముందని హెచ్చరించారు.
CJP సౌరవ్ దాస్ స్ట్రాంగ్ డిమాండ్!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రొటెస్ట్లో ఒక దళిత కుటుంబానికి చెందిన మైనర్ బాలిక తండ్రి సంజయ్పై కొంతమంది క్రిమినల్స్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై FIR ఫైల్ చేసినా, హత్యాయత్నం మరియు SC/ST యాక్ట్ కింద కేసులు పెట్టకుండా పోలీస్లు నిర్లక్ష్యం వహించారని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. నిందితులు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్గా బెదిరిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో, వెంటనే వారిపై కఠిన సెక్షన్లతో అరెస్ట్ చేయాలని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద డిమాండ్ చేశారు.

తెలంగాణలో రేపు మంత్రివర్గ విస్తరణ?
TG: తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కేబినెట్లో ఖాళీ అయిన మూడు స్థానాలను భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు(ఆదివారం) మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన రానుందని, విజయశాంతి, మహేష్ గౌడ్, ప్రసాద్ కుమార్లకు కేబినెట్లో అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది.

బస్సు బోల్తా.. డ్రైవర్ స్పాట్ డెడ్
AP: కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా సమీపంలో జాతీయ రహదారి 161పై శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి బిచ్కుందకు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్ ఆంజనేయులు (50) అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.

ఎయిర్లైన్స్కు ఇంధన కష్టాలు..విమాన టికెట్లపై ప్రభావం?
విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలు మరోసారి పెరిగాయి. సెప్టెంబర్ 1 నుంచి లీటర్పై ₹6.28(5.46%) పెరగడంతో ధర ₹121.28కి చేరింది. ఆగస్టులోనూ ATF ధర పెరిగింది. ఎయిర్లైన్స్ నిర్వహణ ఖర్చుల్లో ఇంధన ఖర్చే 35–40 శాతం వాటా ఉంటుంది. దీంతో విమానయాన సంస్థలపై ఖర్చుల భారం పెరిగి, ఆ ప్రభావం టికెట్ ధరలపై పడే అవకాశం ఉంది.

ఆర్కిటిక్ సముద్రాన్ని గడ్డకట్టించే ప్రయోగాలు
బ్రిటన్ ప్రభుత్వ ఆర్థిక సాయంతో ‘Real Ice’ పేరుతో జియో ఇంజినీరింగ్ ప్రయోగం చేపట్టినట్లు 'ఆండ్రియా సెకోలిని’ సంస్థ వెల్లడించింది. తొలి ప్రయత్నంలో మంచి రిజల్ట్స్ వచ్చినట్లు తెలిపింది. ఇదే తరహాలో ‘Reflection’ అనే మరో సంస్థ కూడా ప్రయోగం నిర్వహించి 45 సెంటీమీటర్ల మందమైన మంచుపొరను సృష్టించినట్లు పేర్కొంది. ఆర్కిటిక్ ఉపరితలాన్ని పరిశీలించిన సమయంలో కొన్ని ప్రాంతాల్లో సహజంగా రంధ్రాలు ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో ప్రయోగంలో భాగంగా డ్రిల్లింగ్ చేసి ఆ రంధ్రాల ద్వారా సముద్రంలోని నీటిని పైకి పంపించారు.

చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం శివారులోని ONGC సైట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం నుంచి లక్కవరం తిరిగి వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న ముదునూరి రామభద్ర రాజు, ఆయన తమ్ముడు ముదునూరి వెంకటసుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న వారి ఇద్దరు భార్యలకు తీవ్ర గాయాలు కావడంతో గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో లక్కవరం గ్రామంలో విషాదం నెలకొంది.

ఆర్జీకర్ కేసులో పురోగతి లేదు: బాధితురాలి తల్లి
కోలకత్తా ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన హత్యాచారం కేసులో సీబీఐ విచారణలో ఎలాంటి డెవలప్మెంట్ లేదని బాధితురాలి తల్లి, బీజేపీ పనిహతి ఎమ్మెల్యే రత్నా దేబ్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా న్యాయం దక్కడం లేదని అన్నారు. 2024 ఆగస్టు 9న తన కూతురు హత్యకు గురైన తర్వాత తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. తనకు న్యాయం జరిగేలా వ్యవస్థను మార్చాలని, కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ పోలీసులకు 72 గంటలే టైమ్- చంద్రశేఖర్ ఆజాద్
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ప్రొటెస్ట్ చేశారు. జంతర్ మంతర్ ధర్నాలో నిషు ఆజాద్ తండ్రి సంజయ్పై దాడి చేసినట్లు ఒక<a href="https://www.theclearcutnews.com/n/iUokvD9"> podcast</a>లో ఒప్పుకున్న స్వాతంత్ర భరద్వాజ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు బెదిరింపులు వస్తున్నాయని, 72 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయకపోతే ఢిల్లీ పోలీస్ కమిషనర్, హోం మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు.

నా పేరుతో ఫేక్ పోస్టులు.. కొండా సురేఖ క్లారిటీ
TG: కొండా సురేఖ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, పోస్టులపై ఆమె క్లారిటీ ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తన పేరుతో వైరల్ అవుతున్న పోస్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని <a href="https://x.com/iamkondasurekha/status/2095786135930966234">'X' పోస్ట్</a> చేశారు. తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలను షేర్ చేశారు. మీడియా, ప్రజలు తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కేవలం ఆ అఫీషియల్ అకౌంట్లనే ఫాలో అవ్వాలని కోరారు.

సూర్య 50వ సినిమా అదేనా?
‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్తో భయపెట్టిన తమిళ స్టార్ హీరో సూర్య, ఇప్పుడు తన 50వ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో హిట్లు కొట్టిన సూర్య, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రోలెక్స్ పాత్రతోనే పూర్తి సినిమా రాబోతోందనే వార్తలపై తాజాగా స్పందించారు. దీంతో ఈ రోలెక్స్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.

ప్రపంచ దేశాలను హెచ్చరించిన UN
ప్రపంచవ్యాప్తంగా 'సూపర్సైజ్డ్ ఎల్నినో' (Supersized El Niño) పరిస్థితులు ఏర్పడే అవకాశముందని ఐక్యరాజ్యసమితి (UN) హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడం, కరువు, వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలపై భారం పడే ప్రమాదముందంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, ప్రజలకు నష్టం కలగకుండా తగిన ప్రొటెక్షన్ చర్యలు చేపట్టేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
CJP నిరసనలో దాడి.. అయినా జైలుకెళ్లలేదు
ఢిల్లీలో CJP చేపట్టిన నిరసనలో ఓ ప్రొటెస్టర్ తండ్రిపై దాడి చేసి ఎలా తప్పించుకున్నారో Swatantra Bhardwaj అనే రైట్-వింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక పోడ్కాస్ట్లో చెప్తున్న వీడియో వైరల్ అవుతోంది. సంజయ్కుమార్ తలపై ఏడు కుట్లు పడ్డాయని, ఆయన కూతురు నిషూ ఆజాద్ పోలీస్స్టేషన్ బయట నిలబడి ‘మా నాన్నకు న్యాయం జరగకపోతే విషం తాగి చచ్చిపోతాం’ అని చెప్పిందని వివరించాడు. తర్వాత రోజు తామంతా బయట ఉన్నామని, జైలుకే వెళ్లలేదన్నాడు. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్, మోదీ లాంటి వాళ్ల సపోర్ట్ తమకుందని అతను వీడియోలో చెప్పాడు.