Latest

చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం శివారులోని ONGC సైట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం నుంచి లక్కవరం తిరిగి వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న ముదునూరి రామభద్ర రాజు, ఆయన తమ్ముడు ముదునూరి వెంకటసుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న వారి ఇద్దరు భార్యలకు తీవ్ర గాయాలు కావడంతో గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో లక్కవరం గ్రామంలో విషాదం నెలకొంది.

ఆర్జీకర్ కేసులో పురోగతి లేదు: బాధితురాలి తల్లి
కోలకత్తా ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన హత్యాచారం కేసులో సీబీఐ విచారణలో ఎలాంటి డెవలప్మెంట్ లేదని బాధితురాలి తల్లి, బీజేపీ పనిహతి ఎమ్మెల్యే రత్నా దేబ్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా న్యాయం దక్కడం లేదని అన్నారు. 2024 ఆగస్టు 9న తన కూతురు హత్యకు గురైన తర్వాత తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. తనకు న్యాయం జరిగేలా వ్యవస్థను మార్చాలని, కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ పోలీసులకు 72 గంటలే టైమ్- చంద్రశేఖర్ ఆజాద్
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ప్రొటెస్ట్ చేశారు. జంతర్ మంతర్ ధర్నాలో నిషు ఆజాద్ తండ్రి సంజయ్పై దాడి చేసినట్లు ఒక<a href="https://www.theclearcutnews.com/n/iUokvD9"> podcast</a>లో ఒప్పుకున్న స్వాతంత్ర భరద్వాజ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు బెదిరింపులు వస్తున్నాయని, 72 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయకపోతే ఢిల్లీ పోలీస్ కమిషనర్, హోం మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు.

నా పేరుతో ఫేక్ పోస్టులు.. కొండా సురేఖ క్లారిటీ
TG: కొండా సురేఖ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, పోస్టులపై ఆమె క్లారిటీ ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తన పేరుతో వైరల్ అవుతున్న పోస్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని <a href="https://x.com/iamkondasurekha/status/2095786135930966234">'X' పోస్ట్</a> చేశారు. తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలను షేర్ చేశారు. మీడియా, ప్రజలు తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కేవలం ఆ అఫీషియల్ అకౌంట్లనే ఫాలో అవ్వాలని కోరారు.

సూర్య 50వ సినిమా అదేనా?
‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్తో భయపెట్టిన తమిళ స్టార్ హీరో సూర్య, ఇప్పుడు తన 50వ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో హిట్లు కొట్టిన సూర్య, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రోలెక్స్ పాత్రతోనే పూర్తి సినిమా రాబోతోందనే వార్తలపై తాజాగా స్పందించారు. దీంతో ఈ రోలెక్స్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.

ప్రపంచ దేశాలను హెచ్చరించిన UN
ప్రపంచవ్యాప్తంగా 'సూపర్సైజ్డ్ ఎల్నినో' (Supersized El Niño) పరిస్థితులు ఏర్పడే అవకాశముందని ఐక్యరాజ్యసమితి (UN) హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడం, కరువు, వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలపై భారం పడే ప్రమాదముందంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, ప్రజలకు నష్టం కలగకుండా తగిన ప్రొటెక్షన్ చర్యలు చేపట్టేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
CJP నిరసనలో దాడి.. అయినా జైలుకెళ్లలేదు
ఢిల్లీలో CJP చేపట్టిన నిరసనలో ఓ ప్రొటెస్టర్ తండ్రిపై దాడి చేసి ఎలా తప్పించుకున్నారో Swatantra Bhardwaj అనే రైట్-వింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక పోడ్కాస్ట్లో చెప్తున్న వీడియో వైరల్ అవుతోంది. సంజయ్కుమార్ తలపై ఏడు కుట్లు పడ్డాయని, ఆయన కూతురు నిషూ ఆజాద్ పోలీస్స్టేషన్ బయట నిలబడి ‘మా నాన్నకు న్యాయం జరగకపోతే విషం తాగి చచ్చిపోతాం’ అని చెప్పిందని వివరించాడు. తర్వాత రోజు తామంతా బయట ఉన్నామని, జైలుకే వెళ్లలేదన్నాడు. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్, మోదీ లాంటి వాళ్ల సపోర్ట్ తమకుందని అతను వీడియోలో చెప్పాడు.

సికింద్రాబాద్-సిర్పూర్కు రెండు స్పెషల్ ట్రైన్లు
ప్రయాణికులకు South Central Railway గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ మధ్య రెండు జనసాధారణ్ Unreserved స్పెషల్ ట్రైన్లు నడపనుంది. ఈరోజు నుంచి ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. 07235 ట్రైన్ మ. 12:10కి సికింద్రాబాద్లో బయలుదేరి సా. 5:30కి సిర్పూర్ చేరుతుంది. 07236 ట్రైన్ సా. 6కి బయలుదేరి రాత్రి 11:15కి హైదరాబాద్ చేరుతుంది. జనరల్ టికెట్తో ప్రయాణించొచ్చు. ఈ ట్రైన్ చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.

నవ్వుల హంగామాతో అల్లరి నరేష్
కామెడీ కింగ్ అల్లరి నరేష్ కొత్త సినిమా ‘రంభ ఊర్వశి మేనక’ థియేటర్లలోకి వచ్చేసింది. చంద్రమోహన్ చింతాడ డైరెక్ట్ చేసిన ఈ ఫన్ మూవీలో సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటిస్తే, వెన్నెల కిషోర్, నరేష్ వీకే ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఎంటర్టైన్మెంట్తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.
PSలో స్పృహ తప్పిపోయిన జర్నలిస్ట్..
ఢిల్లీ CM రేఖా గుప్తాను క్వశ్చన్ చేసేందుకు ట్రై చేసిన షాహీన్ ఖాన్ అనే మహిళా జర్నలిస్ట్పై పోలీసులు దారుణంగా ఎటాక్ చేశారు. VVIP రూట్కి అడ్డుగా ఉన్నారనే కారణంతో సాకేత్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి, ఆమె ముస్లిం అని తెలిసాక మరింత క్రూరంగా కొట్టారని బాధితురాలు ఆరోపించింది. ఈ దాడిలో మరో మహిళా జర్నలిస్ట్ స్పృహ తప్పిపోగా, ఇద్దరి బాడీపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఆరోపణలు అబద్ధమని DCP పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ను ఆ తర్వాత డిలీట్ చేయడం గమనార్హం.

ప్రియురాలికి iPhone కొనివ్వాలని.. గంజాయి మార్గం
TG: ఖమ్మ జిల్లాకు చెందిన 21 ఏళ్ల మిత్ర చైతన్య తన ప్రియురాలికి iPhone కొనివ్వాలని అనుకున్నాడు. దానికి డబ్బు కావాలి. అందుకోసం ఒడిశాలోని పసుపులంక నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో వైరా పోలీసులు తనిఖీలు చేసి అతణ్ని పట్టుకున్నారు. 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

రిజర్వాయర్ పనులకు గ్రీన్ సిగ్నల్
TG: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన షాద్నగర్ నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులకు అడుగు పడిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. రిజర్వాయర్ కోసం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయిందని, భూసేకరణ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. షాద్నగర్లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ప్రాజెక్టుకు ఎలాంటి అవాంతరాలు లేవని స్పష్టం చేశారు.

ఆధార్లో పుట్టిన తేదీ.. ఎక్కువసార్లు మార్చుకోవచ్చా?
ఆధార్లో పుట్టిన తేదీ(Date of Birth)ని ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. రెండోసారి మార్చాల్సి వస్తే సరైన బర్త్ సర్టిఫికెట్ లేదా నమోదు సమయంలో ఆపరేటర్ పొరపాటు చేసినప్పుడు మాత్రమే ప్రత్యేక అనుమతితో పరిశీలిస్తారు. తప్పుడు ఆధారాలతో లేదా వయసులో భారీ తేడాలతో మార్చాలని చూస్తే అప్డేట్ రద్దయి కార్డు నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు వార్న్ చేస్తున్నారు.

ఓటీటీ బింజ్-వాచింగ్ (Binge-watching) ముప్పు
ఓటీటీల్లో వరుసగా వెబ్ సిరీస్లను గంటల తరబడి చూసే బింజ్-వాచింగ్ (Binge-watching) మానసిక అనారోగ్యానికి దారి తీస్తోంది. ఎక్కువగా Binge-watching చేసేవారిలో నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం కనిపిస్తున్నట్లు స్టడీలు చెబుతున్నాయి. స్క్రీన్ టైమింగ్లో ఎక్కువగా గడిపే యూత్ వాళ్ల రోజువారీ జీవితం, సోషల్ రిలేషన్స్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటీటీ చూడటానికి లిమిటేషన్స్, నిద్రకు ముందు ఎక్కువసేపు స్క్రీన్ చూడకపోవడం మంచిదని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

టాటా కంపెనీపై కెన్యా ప్రెసిడెంట్ సీరియస్
కెన్యాలోని టాటా కెమికల్స్ మగాదీపై ప్రెసిడెంట్ విలియమ్ రూటో ఫైర్ అయ్యారు. దేశం నుంచి కంపెనీ వెళ్లిపోవాలని ఆదేశించారు. 100 ఏళ్లుగా కెన్యాలో ఆపరేషన్స్ సాగిస్తున్నా లోకల్ ప్రజలకు, ఎకానమీకి సరైన బెనిఫిట్ కలగలేదని ఆరోపించారు. సోడా యాష్ను ఎక్స్పోర్ట్ చేయడం తప్ప స్థానికంగా గ్లాస్, కెమికల్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదని సీరియస్ అయ్యారు. టాటా స్థానంలో రెండు కొత్త కంపెనీలను తీసుకొచ్చి స్థానికులకు జాబ్స్ కల్పిస్తామని చెప్పారు. అయితే స్థానిక రూల్స్ను ఫాలో అవుతూనే ఆపరేషన్స్ చేశామని టాటా కెమికల్స్ చెబుతోంది.

మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతిపత్రం అందజేత
TG: సంచార, విముక్తి జాతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేణుక నారాయణ నేతృత్వంలో సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తిపిరిశెట్టి, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర విముక్తి జాతుల దినోత్సవం–2026 నిర్వహణ, సంక్షేమ అంశాలపై చర్చించారు. బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ, MBC కార్పొరేషన్ CEOతో చర్చించి త్వరలో తుదినిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

రోహిత్ శర్మ భవిష్యత్తుపై BCCI రివ్యూ
రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి BCCI రివ్యూ మీటింగ్లో చర్చ జరిగింది. అయితే రోహిత్ రిటైర్మెంట్పై ఇప్పటివరకు ఎలాంటి అఫిషియన్ డెసిషన్ తీసుకోలేదు. BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా కూడా రోహిత్ ఫామ్లో ఉన్నాడని చెప్పారు. ప్రస్తుతానికి రోహిత్ వన్డే క్రికెట్లో కొనసాగాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆయన పనితీరు, ఫిట్నెస్పై 2027 వరల్డ్ కప్కి ఆయన సెలక్షన్ ఆధారపడి ఉంటుంది.

OTTలోకి ‘DC’
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన యాక్షన్ క్రైమ్ సినిమా ‘DC’ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. అరుణ్ మాథేశ్వరన్ తీసిన ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్గా నటించింది. థియేటర్లలో హిట్ కొట్టిన ఈ సినిమా, ఈరోజు (September 4) నుంచి Sun NXT యాప్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ చూసేయొచ్చు.

మారుమూల ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు
మారుమూల ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలను దగ్గర చేసేందుకు సుప్రీంకోర్టు 26 మొబైల్ ఈ-సేవా వ్యాన్లను ప్రారంభించనుంది. సుప్రీంకోర్టు ఈ-కమిటీ పర్యవేక్షణలో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని మధ్యానం 2 గంటలకు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, ఈ-కమిటీ ప్యాట్రన్-ఇన్-చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవల సంస్థ, న్యాయశాఖ సహకారంతో ఈ వ్యాన్లు పనిచేస్తాయి. వీటి ద్వారా ఈ-కోర్టు సేవలు, ఈ-ఫైలింగ్, ఈపేమెంట్, మొబైల్ లోక్ అదాలత్లు, ఉచిత న్యాయ సహాయం, న్యాయ అవగాహన అందించనున్నారు.

ఇందిరమ్మ ఇంటికి మంత్రి గృహప్రవేశం
TG: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటిని ప్రారంభించి కుటుంబ సభ్యులను అభినందించారు. పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

మహిళా సమైక్య భవన్కు డీకే అరుణ శంకుస్థాపన
TG: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన్ నిర్మాణానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, కమ్యూనిటీ భవనాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. భవనం అందుబాటులోకి వస్తే సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.