Latest
మంచు కొండల్లో జలప్రళయం.. షాకింగ్ వీడియో వైరల్! 😱🏔️
నేపాల్-టిబెట్ బార్డర్లో గ్లేసియర్ (మంచు కొండ) కరిగిపోవడంతో ఒక్కసారిగా భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. రాళ్లు, మంచుతో కూడిన బురద ప్రవాహం సెకెన్లలోనే ఊళ్లను, బ్రిడ్జీలను ఊడ్చేసింది. ఈ దెబ్బకి వందలాది మంది బురద దిబ్బల కింద ఇరుక్కుపోయారు. హిమాలయ లోయల నుంచి అత్యంత స్పీడ్గా దూసుకొచ్చిన, భయంకరమైన వరద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"యెష నాగుల కట్ట మీద" లిరికల్ వీడియో వచ్చేసింది
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ నుంచి “యెష నాగుల కట్ట మీద” సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. తెలంగాణ ఫోక్ స్టైల్ లో ఉన్న ఈ పాటలో కీర్తి సురేష్ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి నానితో కలిసి స్టెప్పులు వేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, జంగి రెడ్డి, ప్రభా పాడారు. సుధాకర్ చెరుకూరి ₹200 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.

దేగామ గ్రామం లో పంటల డిజిటల్ సర్వే
బజార్హీత్నూర్ మండలం దేగామ గ్రామంలో డీసీఎస్ టీఎల్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. AEO ప్రవీణ్ ఆధ్వర్యంలో సర్వే వాలంటీర్ సతీష్ పంట పొలాలను సందర్శించి సాగు పరిస్థితులను పరిశీలించారు. అందరూ రైతులు తమ తమ పంట వివరాలను తప్పకుండా నమోదు చేసుకోవాలని తెలిపారు

మానధనులు – నవల
రచయిత హోవర్డ్ ఫాస్ట్ తన 27 ఏళ్ల వయసులో రాసిన ‘The Last Frontier’ నవలను కె.వి.ఆర్ 1979లో తెలుగులోకి ‘మానధనులు’గా అనువదించారు. ‘మానధనులు’ అంటే ఆత్మగౌరవం ఉన్నవారు అని అర్థం. కొలంబస్ అమెరికాను ఇండియాగా పొరబడ్డాడు. దీంతో అక్కడి ఆదివాసులను ‘ఇండియన్స్’ అని పిలిచారు. బ్రిటిషర్స్ ఉత్తర ప్రాంతాలను ఆక్రమించిన తర్వాత, ఆదివాసులను బలవంతంగా దక్షిణ ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతమే ఇప్పటి ఓక్లహామా. అక్కడి చెయిన్నీ తెగవారు తమ సొంత భూమికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకోవడమే ఈ నవల కథ. ధర రూ.150. కొనే <a href="https://logilitelugubooks.com/book/maanadhanulu-howard-fast-kvr">లింక్ </a>ఇది.

నేపాల్ వరదల్లో 97 ఏళ్ల బామ్మ మిరాకిల్
రీసెంట్గా నేపాల్ వరదల్లో బురదలో ఇరుక్కుపోయిన ఓ బామ్మను JCB ద్వారా రెస్క్యూ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ బామ్మ పేరు 'గునా మాయా బోహరా', వయసు 97 ఏళ్లు. అంతటి భయంకరమైన జలప్రళయంలో చుట్టూ ఉన్నవాళ్లు ప్రాణాలు కోల్పోయినా, ఈ బామ్మ చావును గెలిచి ప్రాణాలతో బయటపడింది. ఆమెను కాపాడుకోవడానికి మనవడు దీపక్ కాట్మాండు నుంచి వచ్చి, 4 గంటల పాటు రెస్క్యూ టీమ్తో కలిసి బామ్మను సేఫ్గా బయటకు తీశారు. మనవడు మీడియాతో మాట్లాడుతూ "యుద్ధం గెలిచొచ్చిన రియల్ వారియర్ లా ఉంది మా బామ్మ" అని చెప్పాడు.

ఉగాండా రాజు ఓయో న్యింబా కన్నుమూత
ఉగాండాలోని టూరో రాజ్యానికి చెందిన రాజు ఓయో న్యింబా కబంబా ఇగురు రుకిడి IV 34 ఏళ్ల వయసులో మరణించారు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో రాజు అయిన ఆయన మరణం ఉగాండా ప్రజలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. టూరో ప్రధానమంత్రి కాల్విన్ ర్వోమీర్ అకీకి తెల్లవారుజామున ఈ విషయాన్ని ప్రకటించారు. 1995లో తండ్రి రాజు ప్యాట్రిక్ కబోయో ఒలిమి III మరణం తర్వాత మూడేళ్ల వయసులోనే ఓయోను రాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ సమయంలో ఆయన ప్రపంచంలోనే అతి చిన్న పాలక రాజుగా పేరుపొందారు.

గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు: సీఎం
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం గన్నెల పంచాయతీ ఆర్కే నగర్లో ‘సంజీవని’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆరోగ్య రథాల ద్వారా గిరిజనులకు ఇంటి వద్దే వైద్య పరీక్షలు, మందులు, ఫాలోఅప్ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. గన్నెల పీహెచ్సీలో సేకరించిన రక్త నమూనాలను డ్రోన్లతో విశాఖ జీజీహెచ్కు తరలించే ప్రక్రియను పరిశీలించారు. మారుమూల ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

మీ పిల్లలకు ఇలాంటి ఫుడ్ పెడతారా?.. అభిజీత్ దీప్కే
గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు Expired ఫుడ్ అందిస్తున్నారంటూ CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘X’ లో పోస్ట్ చేశారు. 'ఇలాంటి ఫుడ్ను అధికారంలో ఉన్నవాళ్లు తమ పిల్లలకు పెడతారా? నిజాన్ని బయటపెడితే FIRలు పెట్టినా పర్లేదు.. నిజాన్ని ఎక్స్పోజ్ చేయడం ఆపము' అంటూ వీడియోలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం <a href="https://x.com/abhijeet_dipke/status/2093584722295394416">సోషల్ మీడియాలో</a> చర్చకు దారితీస్తోంది.
స్టీరింగ్పైనే కుప్పకూలిన బస్సు డ్రైవర్
TG: జగిత్యాల జిల్లా మద్దునూరు నుంచి జగిత్యాలకు ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ లక్ష్మణ్కు మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో స్టీరింగ్పైనే కుప్పకూలారు. అయితే చివరి వరకు అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సు అదుపు తప్పకుండా పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ఘటన అనంతరం 108కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆటోలో లక్ష్మణ్ను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వచ్చే సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉన్న లక్ష్మణ్ ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పినా డ్రైవింగ్ డ్యూటీ వేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

‘టాక్సిక్’ పోటీ ఉన్నా తగ్గేదేలే అంటున్న ‘ఇరుముడి’
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ వారమే యష్ నటించిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' విడుదలైనప్పటికీ, 'ఇరుముడి' క్రేజ్ మాత్రం తగ్గలేదు. బుక్ మై షోలో ఈ వీకెండ్ 'టాక్సిక్' కి 15 వేల టికెట్లు అమ్ముడవగా, 'ఇరుముడి' 23 వేలకు పైగా టికెట్లతో ముందంజలో ఉంది. తక్కువ థియేటర్లలో ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తుండటంతో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది.

BRS 3.0లో తప్పు చేసినోళ్లను వదలం : RS ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్లో జరిగిన మీటింగ్లో BRS జనరల్ సెక్రటరీ RS ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో KCR నాయకత్వంలో 'BRS 3.0' ప్రభుత్వం చాలా డిఫరెంట్గా ఉంటుందని అన్నారు. మంచి చేసిన వాళ్లను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం కానీ, రేవంత్ రెడ్డి మాటలు విని అక్రమ కేసులు పెట్టి, ప్రజలను వేధించిన వాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన వారిని విచారించడానికి ప్రత్యేకంగా ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

BC, EBC స్టూడెంట్స్కు విదేశీ చదువులకు గోల్డెన్ ఛాన్స్!
TG: విదేశాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే BC, EBC స్టూడెంట్స్కు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి ద్వారా అవకాశమిస్తోంది. 2026–27కు మొత్తం 350 మందిని సెలెక్ట్ చేయనున్నారు. ఇందులో 250 మంది BC, 100 మంది EBC స్టూడెంట్స్ ఉంటారు. <a href="https://telanganaepass.cgg.gov.in/#">అప్లికేషన్స్</a> సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఉంటాయి. ఫామిలీ Annual Income రూ. 5 లక్షల్లోపు, ఏజ్ 35 ఏళ్లలోపు, గ్రాడ్యుయేషన్లో 60% మార్కులు ఉండాలి. GRE/GMAT, TOEFL/IELTS/PTE స్కోర్ కూడా అవసరం. PG, PhD వంటి కోర్సులకు ఆర్థిక సాయం పొందొచ్చు. <a href="https://telanganaepass.cgg.gov.in/#">Information</a>

కూటమి ప్రభుత్వంతో వ్యవసాయ సంక్షోభం: శిల్పా రవిచంద్ర
AP: నంద్యాల జిల్లా రైతుల సాగునీటి సమస్యలపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి విమర్శించారు. నంద్యాలలోని తన నివాసంలో రైతులతో సమీక్ష నిర్వహించి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. సెప్టెంబర్ 1న వెలుగోడు రిజర్వాయర్ వద్ద సాగునీటి సాధన కోసం వైసీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్షా శిబిరం 1978వ రోజున ఐద్వా విశాఖ జిల్లా కమిటీ పాల్గొని సంఘీభావం తెలిపింది. ఐద్వా నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను బలోపేతం చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రైవేటు స్టీల్ పరిశ్రమలకు భూములు, విద్యుత్, నీరు, పన్ను రాయితీలు కల్పించడం ప్రభుత్వ విధానాల్లోని ద్వంద్వ వైఖరిని చూపుతోందన్నారు. ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు.

పేపర్ కప్పుల్లో టీ, కాఫీ తాగుతున్నారా?☕️ అయితే ఇది మీకోసమే!
మనం రోజూ ఎకో-ఫ్రెండ్లీ అని పేపర్ కప్పుల్లో వేడి వేడి టీ, కాఫీలు తాగేస్తుంటాం. ఈ పేపర్ కప్పులు లీక్ అవ్వకుండా ఉండటానికి లోపల సన్నని ప్లాస్టిక్ లేదా బయోడిగ్రేడబుల్ కోటింగ్ వేస్తారని ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ రీసెర్చర్లు తెలిపారు. మనం వేడి డ్రింక్స్ పోయగానే ఆ వేడికి లక్షలాది 'మైక్రోప్లాస్టిక్ కణాలు' కరిగి డ్రింక్లో కలిసిపోతున్నాయని, నార్మల్ ప్లాస్టిక్ కోటింగ్ కంటే బయోడిగ్రేడబుల్ కప్పుల నుంచే '12 రెట్లు ఎక్కువ' ప్లాస్టిక్ కణాలు విడుదలవుతున్నట్లు తేలింది.

అమ్మమ్మ కళ..మనవరాలు కొనసాగించిందిలా!
కేరళంకు చెందిన మూఱిక్కల్ పంకజాక్షి ‘నోక్కువిద్య పావకళి’ కళతో ప్రసిద్ధులు. ప్రపంచంలోనే ఇది చాలా అరుదైన బొమ్మలాట కళ. కళాకారులు చిన్న కర్రను ముక్కు, పై పెదవి మధ్య నిలబెట్టి, దాని మీద బొమ్మలను ఉంచి, దారాలతో ఆడిస్తారు. దీని సాయంతో రామాయణం, మహాభారతం కథలు చెప్తారు. పంకజాక్షి చనిపోయే ముందు ఆమె మనవరాలు కే.ఎస్.రంజని ఈ కళ నేర్చుకుంది. ఐదేళ్లపాటు కష్టపడి ప్రాక్టీస్ చేసి నేర్పు సంపాదించింది. ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తూ కుటుంబ వారసత్వాన్ని కాపాడుతోంది.

భారత్ Forex Reserves రికార్డ్.. $729.33B!
భారత్ Forex Reserves మరోసారి కొత్త రికార్డ్ సృష్టించాయి. ఆగస్టు 21తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు ఏకంగా $729.33Bకు చేరాయి. ఒక్క వారంలోనే $12.42B పెరిగాయి. ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు, గోల్డ్ నిల్వలు పెరగడం దీనికి కారణం. RBI తీసుకున్న కొన్ని చర్యలతో విదేశాల నుంచి భారీగా డాలర్లు భారత్లోకి వచ్చాయి. ఇలా నిల్వలు పెరగడం వల్ల ప్రపంచంలో ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినా, దేశానికి కొంత బలమైన రక్షణ ఉంటుంది. రూపాయిపై ఒత్తిడి వచ్చినప్పుడు RBIకి మార్కెట్లో జోక్యం చేసుకునే అవకాశం కూడా పెరుగుతుంది.

కరెంట్ బిల్లులు చెల్లించినా అదనంగా డబ్బులు డిమాండ్
TG: వరంగల్ జిల్లా శంభునిపేటలో విద్యుత్ వినియోగదారులకు ఫోన్ చేసి రూ.3 వేలు డిమాండ్ చేసినట్లు ఓ అసిస్టెంట్ లైన్మ్యాన్పై ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లులు పూర్తిగా చెల్లిస్తున్నప్పటికీ అదనంగా డబ్బులు ఇవ్వాలని కోరినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని వినియోగదారులు కోరారు.

Gen Zకి ఉద్యోగాలు, చదువే పెద్ద టెన్షనా?
దేశంలోని Gen Z యువతను ప్రస్తుతం ఎక్కువగా ఏ విషయం టెన్షన్ పెడుతోంది? తాజాగా వచ్చిన ఓ పోల్లో దీనికి ఆసక్తికరమైన సమాధానం కనిపించింది. Gen Zలో 53% మందికి ఉద్యోగాలు, ఉపాధి ప్రధాన సమస్యగా అనిపిస్తే.. మరో 22% మంది చదువు, పరీక్షల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. అంటే మొత్తం 75% మందికి ఈ రెండు విషయాలే పెద్ద సమస్యలుగా కనిపిస్తున్నాయి. కష్టపడి చదివినా, పనిచేసినా అందరికీ సమానంగా అవకాశాలు దొరకడం లేదనే భావన కూడా యువతలో ఉంది. ఈ అసంతృప్తి CJP వైపు యువతను ఆకర్షిస్తోందా అనే చర్చ మొదలైంది.

ముహమ్మద్ ప్రవక్తను ‘గొప్ప ఫెమినిస్ట్’ అన్న జర్నలిస్ట్
‘The Wire’ న్యూస్ సంస్థ జర్నలిస్ట్ అర్ఫా ఖానుమ్ షేర్వానీ ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా ముహమ్మద్ ప్రవక్తను ‘ఆ కాలపు అత్యంత గొప్ప ఫెమినిస్ట్’ అని పోస్ట్ చేయడం వైరల్గా మారింది. ప్రవక్త మహిళలకు వారసత్వం, సమ్మతి, విడాకులు వంటి హక్కులు ఇచ్చారని, 1400 సంవత్సరాల క్రితం పురుషాధిపత్య వ్యవస్థను సవాలు చేశారని ఆమె అందులో రాశారు. ఈ పోస్ట్కు కొందరు సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు ఖండిస్తున్నారు.

అనంతగిరిలో తెలుగు భాషా, క్రీడా దినోత్సవాలు
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి గిరిజన బాలికల పాఠశాల–2లో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం బి. మంగమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతులను స్మరించుకున్నారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష ప్రాధాన్యత, మాతృభాష పరిరక్షణ, క్రీడల ఆవశ్యకతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.