Crime

ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిషియన్‌కు వేధింపులు
Crime· 13 Aug 2026

ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిషియన్‌కు వేధింపులు

AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ద్వారా బ్యూటిషియన్‌ను వేధిస్తున్న ఫోటోగ్రాఫర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న బాధితురాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి, అందులో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి దాసరి రామకృష్ణ అనే ఫోటోగ్రాఫర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇంట్లో గంజాయి పార్టీ.. అధికారులు వచ్చేలోగా పరార్
Crime· 13 Aug 2026

ఇంట్లో గంజాయి పార్టీ.. అధికారులు వచ్చేలోగా పరార్

TG: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గంజాయి తాగుతున్న యువకులను కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు నర్సాపూర్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తూ స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రాత్రి కొందరు యువకులు అతని ఇంట్లో గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించిన కాలనీవాసులు వారిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకునేలోపే, వారు తప్పించుకుని పారిపోయారు. ఘటన స్థలంలో గంజాయి ప్యాకెట్‌, కూల్‌డ్రింక్ బాటిల్స్ లభించాయి. తప్పించుకున్న యువకులను పట్టుకుంటామని అధికారులు తెలిపారు.

హత్య చేసి మిస్సింగ్ డ్రామాతో తప్పించుకునే ప్లాన్
Crime· 13 Aug 2026

హత్య చేసి మిస్సింగ్ డ్రామాతో తప్పించుకునే ప్లాన్

TG: తండ్రిని హత్యచేసి మిస్సింగ్ కేసుగా చిత్రీకరించిన ఘటనలో కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా భీమారం పరిధిలో జరిగిన ఈ కేసులో భీమిని ఉదయ్‌(23) నిందితుడిగా గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకోవడం తండ్రి లక్ష్మణ్‌కు ఇష్టం లేకపోవడంతో తరచూ కుమారుడు, కోడలిని దూషిస్తూ గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. ప్లాన్ ప్రకారం ఉదయ్‌ తండ్రిని బైక్‌పై గొల్లవాగు ప్రాజెక్టు ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు పిసికి హత్య చేసినట్లు విచారణలో లేలింది. మృతదేహంపై పెట్రోల్‌ పోసి తగులబెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

విద్యార్థినులపై అనుచిత ప్రవర్తన.. అధికారులు సీరియస్
Crime· 12 Aug 2026

విద్యార్థినులపై అనుచిత ప్రవర్తన.. అధికారులు సీరియస్

AP: అనంతపురం జిల్లా యల్లనూరు ZP ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీరామమూర్తిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమని తేలింది. టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.