Crime· 15 Aug 2026
దొంగిలించిన చీరే దొంగలను పట్టించింది
TG: రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్లోని వినాయకనగర్లో యాదయ్య ఇంట్లో 2023లో రూ.2.50 లక్షల నగదు, 9తులాల బంగారం, చీరలు చోరీ అయ్యాయి. కేసు నమోదైనా నిందితు ఆచూకీ లభించలేదు. ఇటీవల యాదయ్య భార్య ఓ ఫంక్షన్కు వెళ్లగా, ఇంటి వెనుక నివసించే స్వప్న అనే మహిళ కట్టుకున్న చీరను గుర్తించారు. అది తన ఇంట్లో చోరీకి గురైన చీరగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్వప్న, ఆమె భర్త రాములును అదుపులోకి తీసుకుని విచారిస్తే, మూడేళ్ల క్రితం మేమే దొంగతనం చేశాం అని ఒప్పుకున్నారు. ఆ దంపతుల్ని అరెస్ట్ చేశారు.