Local· 2d ago
వేంసూరులో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
TG: ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ఎస్ఐఆర్–2026లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ కేసులపై జరుగుతున్న విచారణలను కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన ఓటర్ల వివరాలు, బీఎల్ఓల పరిశీలన, సంబంధిత ఆధారాలు, రికార్డులను తనిఖీ చేశారు. అర్హత కలిగిన కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును పారదర్శకంగా విచారించాలని, పెండింగ్లో ఉన్న కేసులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.