Local

పోచమ్మ తల్లికి బోనాలు.. భక్తులతో కిక్కిరిసిన కొందుర్గు
Local· 22 Aug 2026

పోచమ్మ తల్లికి బోనాలు.. భక్తులతో కిక్కిరిసిన కొందుర్గు

TG: కొందుర్గులో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో శ్రావణమాసం రెండో శుక్రవారం, వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

కాగ్నా బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారిని పరిశీలించిన బుయ్యని
Local· 22 Aug 2026

కాగ్నా బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారిని పరిశీలించిన బుయ్యని

TG: కాగ్నా బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారితో ప్రయాణికులు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉండటంతో సమస్యను త్వరగా పరిష్కరించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అధికారులను కోరారు. తాండూర్ పట్టణ సమీపంలోని కాగ్నా బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారిని ఆయన పరిశీలించారు. బ్రిడ్జిపై రహదారి పరిస్థితిని పరిశీలించి ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన బారికేడ్లు, హెచ్చరిక సూచికలను కూడా తనిఖీ చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

పత్తి పంటకు ముప్పు రాకుండా.. రైతులకు కీలక దిశానిర్దేశం
Local· 22 Aug 2026

పత్తి పంటకు ముప్పు రాకుండా.. రైతులకు కీలక దిశానిర్దేశం

TG: పత్తి పంటలో చీడపీడలను తొలిదశలోనే గుర్తిస్తే నష్టాన్ని నివారించవచ్చని ఏఈఓ శ్రీనివాస్ రైతులకు సూచించారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్నతిమ్మాపూర్ గ్రామంలో పత్తిపంటను ఆయన పరిశీలించారు. పంట ఎదుగుదల, మొక్కల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పంటలో చీడపీడల ఉనికిని ఎప్పటికప్పుడు గమనించాలని, తెగుళ్లు లేదా పురుగుల ప్రభావం కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమస్యను గుర్తించకుండా సొంతంగా మందులు వినియోగించడం వల్ల పంటకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.