Local· 19 Aug 2026
అభివృద్ధి పనులు పరిశీలించిన డిప్యూటీ కమిషనర్
TG: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామాన్ని పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ సందర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫామ్పాండ్, చేపల చెరువు, స్టీల్ బ్యాంక్ను పరిశీలించారు. అనంతరం డస్ట్బిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామస్తులకు పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ, డీఎల్పీఓ, డీఆర్డీఓ, ఎంపీడీవో తదితర అధికారులు పాల్గొన్నారు.