Latest

సకల కళల జేఏసీ ఆధ్వర్యంలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం
TG: తెలంగాణ ఏర్పడి 13 సంవత్సరాలు గడిచినా తెలంగాణ జానపద అకాడమీ గానీ, తెలంగాణ జానపద విశ్వవిద్యాలయం గానీ ఇప్పటికీ ఏర్పాటు కాలేదని సకల కళల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. భావితరాలకు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అందించడానికి తెలంగాణ జానపద అకాడమీ, తెలంగాణ జానపద విశ్వవిద్యాలయం తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 11 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సమావేశానికి తప్పక రావాలని సకల కళల జేఏసీ తరఫున భూపతి వెంకటేశ్వర్లు కోరారు.

నితిన్ హీరోగా ‘దండోరా’ దర్శకుడి కొత్త సినిమా ప్రారంభం
‘దండోరా’ సినిమాతో మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మురళీకాంత్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. హీరో నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్లో లాంఛనంగా మొదలైంది. సినిమాకు ‘అలియాస్ రుక్మిణి’ అనే పేరు ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ వీడియో నాని వాయిస్ ఓవర్తో అందర్నీ ఆకట్టుకుంటోంది.

సాయి పల్లవిని రకుల్ డామినేట్ చేసిందా?
దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న‘రామాయణ’ ట్రైలర్ విడుదలైన తర్వాత పాత్రల ప్రెజెంటేషన్పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ట్రైలర్లో రావణాసురుడిగా నటించిన యష్ రాజసం, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, మరోవైపు శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్గా, పవర్ఫుల్గా కనిపించి సాయి పల్లవి కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బ్యాంకిపూర్ బీజేపీ చేయిజారినట్టేనా?
బిహార్ రాష్ట్రంలోని బ్యాంకిపూర్ సీటు మీద బీజేపీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ సుమారు 12 వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. బీజేపీకి బలమైన కోటగా ఉన్న ఈ ప్రాంతాన్ని గతంలో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంగా పిలిచేవారు. ఈ నియోజకవర్గంలో 25 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు కాయస్థులున్నారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ రిజైన్ చేసిన తర్వాత నీరజ్ కుమార్ సిన్హాను ఇక్కడ నుంచి పోటీలో నిలబెట్టారు. అటు ప్రశాంత్ కిశోర్కీ, ఇటు నీరజ్ కుమార్కీ ఇవే తొలి ఎన్నికలు కావడం విశేషం.

బాంకీపూర్ బైపోల్: ప్రశాంత్ కిషోర్కు 16,000 ఓట్ల భారీ ఆధిక్య
బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నారు. మొత్తం 31 రౌండ్లలో 26 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై దాదాపు 16,000 ఓట్ల స్పష్టమైన ముందంజలో ఉన్నారు. దీంతో 1995 నుంచి ఉన్న బీజేపీ మూడు దశాబ్దాల ఆధిపత్యం ప్రమాదంలో పడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.

పెల్లెట్ గన్స్ వాడకంపై గైడ్లైన్స్- సుప్రీంకోర్టు
నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్లో ఫైల్ అయిన కేసులను ఉపసంహరించుకునే పూర్తి ఫ్రీడమ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రొటెస్ట్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మర్డర్, రేప్, టెర్రరిజం లాంటి తీవ్రమైన నేరాలకే 'క్రిమినల్' అనే పదం వర్తిస్తుందని, చిన్న చిన్న కేసులున్న వారిని అలా చూడకూడదని పేర్కొంది. ఇక పెల్లెట్ గన్స్ వాడకంపై కంప్లీట్ గైడ్లైన్స్ ఇస్తామని చెబుతూ, తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది.

పగలు కాలేజ్.. రాత్రి పెట్రోల్ పంప్లో Job!
పగలు కాలేజీలో స్టూడెంట్.. రాత్రి పెట్రోల్ పంప్లో వర్కర్.. చదువు కోసం ఆమె చేస్తున్న హార్డ్వర్క్ ఇప్పుడు వైరల్! ❤️ మహారాష్ట్రలోని రాయ్గడ్కు చెందిన ఓ కాలేజీ విద్యార్థిని తన చదువు ఖర్చులను తానే చూసుకునేందుకు క్లాసులు పూర్తయ్యాక పెట్రోల్ పంప్లో పనిచేస్తోంది. అక్కడికి వచ్చిన ఓ కస్టమర్ ఆమె స్టోరీ తెలుసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. చదువుతో పాటు జాబ్ను బ్యాలెన్స్ చేస్తున్న ఆమె డెడికేషన్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఖర్చులపైనా చర్చ మొదలైంది.
4.5 KMకి 45 మినిట్స్.. ఇదేం ట్రాఫిక్!
4.5 కిలోమీటర్లే కదా.. త్వరగా వెళ్లిపోవచ్చు అనుకుంటున్నారా? బెంగళూరు ట్రాఫిక్లో మాత్రం లెక్క వేరే! బెంగళూరులో కేవలం 4.5 కిలోమీటర్లు వెళ్లడానికి 45 నిమిషాలు పట్టిందంటూ ఓ వ్యక్తి షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. వీడియో చూసిన చాలామంది బెంగళూరు ట్రాఫిక్లో తమ రోజువారీ ఎక్స్పీరియన్స్ కూడా ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేశారు. గూగుల్ మ్యాప్స్ "Almost there" అంటుంది... బెంగళూరు ట్రాఫిక్ మాత్రం “కూర్చో బ్రో, ఇంకా టైమ్ ఉంది” అంటుందేమో!😂

సహజీవనంలో గృహహింస కేసు పెట్టొచ్చా? సుప్రీంకోర్టు కీలక తీర్పు
లైవ్-ఇన్ రిలేషన్షిప్(సహజీవనం)లో ఉన్న మహిళలకు కూడా సెక్షన్ 498A (గృహ హింస) రక్షణ వర్తిస్తుందని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సహజీవనంలో హరాస్మెంట్కు గురైన మహిళలు ఈ సెక్షన్ కింద కేసు పెట్టొచ్చని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉంటేనే మహిళ నిరూపించాల్సి ఉంటుందని పేర్కొంది. కర్ణాటకకు చెందిన ఓ మహిళ ఫైల్ చేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

బాంకీపూర్ బైపోల్: 11,500 ఓట్ల ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్!
బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల లెక్కింపులో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 20 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 11,500 ఓట్ల ముందంజ సాధించారు. 1995 నుంచి ఉన్న బీజేపీ మూడు దశాబ్దాల ఆధిపత్యానికి ఇది పెద్ద దెబ్బ. నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.

‘అగధ’ మూవీ ట్రైలర్ : 5 భాషల్లో రిలీజ్!
దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ LLP బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. అతీంద్రియ శక్తులు, మంత్ర తంత్రాలు సస్పెన్స్ బ్యాక్డ్రాప్తో వస్తున్న ఈ సినిమా, ఆగస్టు 14న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది.

184 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన SI!
హర్యానాలో SI అశోక్ కుమార్ వర్మ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. 1989 నుంచి ఇప్పటివరకు ఈయన 184 సార్లు బ్లడ్ డొనేషన్, 90 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 599 బ్లడ్ క్యాంప్స్ పెట్టి ఏకంగా 63 వేల మంది ప్రాణాలను కాపాడారు. అంతేకాకుండా 'రోటీ బ్యాంక్' ద్వారా పేదలకు ఫుడ్ అందిస్తున్నారు. నార్కోటిక్స్ ఆఫీసర్గా 4,800 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా లక్షలాది మందిని డ్రగ్స్కు దూరం చేశారు. అతని సేవలకి గుర్తింపుగా 2020లో రాష్ట్రపతి మెడల్తో పాటు రెండు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.

అథ్లెట్లపై పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్ట్!
కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఇండియన్ అథ్లెట్లు 39 మెడల్స్ గెలవడంపై <a href="https://x.com/PawanKalyan/status/2084151269741269131?s=20">పవన్ కళ్యాణ్</a> స్పందించారు. ప్లేయర్స్ పడ్డ కష్టం, వారి డిసిప్లిన్ అండ్ శాక్రిఫైస్ వల్లే ఈ రిజల్ట్ వచ్చిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అథ్లెట్లతో పాటు వారి కోచ్లకు, ఫ్యామిలీస్కి కంగ్రాట్స్ చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల డ్రీమ్స్ను వీళ్లు నిజం చేశారని, యంగ్ జనరేషన్కు ఇది పెద్ద ఇన్స్పిరేషన్ అని పవన్ పేర్కొన్నారు.

వయాగ్రాతో క్యాన్సర్కు చెక్!
పురుషుల్లో అంగస్తంభన సమస్యకు వాడే ‘వయాగ్రా’ (సిల్డెనాఫిల్) క్యాన్సర్ కణాల వ్యాప్తిని, కణితుల పెరుగుదలను అడ్డుకుంటున్నదని ‘వీజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్' పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వయాగ్రా 'క్యాన్సర్' వ్యాప్తిని నెమ్మదింపజేయటంలో సహాయపడుతుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లభించాయి. శరీరంలో ఒక చోట క్యాన్సర్ మొదలయ్యాక..మిగతా అవయవాలకు చేరాలంటే కొలెస్ట్రాల్ కావాలి. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు కీమోథెరపీ మందులతో పాటు వయాగ్రా వాడితే మరింత ప్రభావం కనపడిందని శాస్త్రవేత్తల బృందం తేల్చింది.

దోచుకున్న డబ్బుని తిరిగిచ్చేసిన దొంగలు.. లెటర్ వైరల్!
AP: కాకినాడ జిల్లా కరపలో వింత ఘటన జరిగింది. జులై 18న ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగలు, 2 వీక్స్ తర్వాత గోల్డ్, డబ్బును అదే ఇంట్లో తిరిగి వదిలేసి వెళ్లారు. దొంగతనం చేయడం తప్పేనని ఒప్పుకుంటూ అపాలజీ లెటర్ కూడా రాసి వెళ్లారు. చోరీ చేసిన డబ్బులో రూ.22 వేలును యూజ్ చేశామని, ఆ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేమని Sorry చెప్తూ.. లెటర్లో రాశారు. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.

ఫంక్షన్ నుండి వస్తే శవమై కనిపించింది!
అస్సాంలోని హైలాఖాండీ జిల్లాలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఫంక్షన్కు వెళ్లి కజిన్తో గొడవపడి ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చిన బాలిక, కుటుంబ సభ్యులు వచ్చేసరికి తల, ముఖం గుర్తుపట్టలేనంతగా విదంగా శవమై కనిపించింది. ప్రైవేట్ భాగాల్లోకి రాడ్ తో నెట్టి, లైంగిక దాడికి ఒడిగట్టినట్లు కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు నేషనల్ హైవేపై ధర్నా చేపట్టగా, ప్రస్తుతం ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Yen కోసం US–Japan కలిసి రంగంలోకి!
కరెన్సీ పడిపోతుంటే చూస్తూ కూర్చుంటారా..? అమెరికా–జపాన్ కలిసి రంగంలోకి దిగేశాయి! జపాన్ యెన్ విలువను స్టేబుల్ చేయడానికి రెండు దేశాలు కలిసి అరుదైన స్టెప్ తీసుకున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో యెన్ విలువ ఒక్కసారిగా మూడు నెలల హైకి చేరింది. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా వచ్చాయి. వార్స్, ఆయిల్ ధరలు, మార్కెట్స్తో ఇప్పటికే టెన్షన్ ఉండగా.. ఇప్పుడు కరెన్సీ కూడా గ్లోబల్ పవర్ గేమ్లో కొత్త హాట్ టాపిక్గా మారింది.

బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి!
ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఇంట త్వరలోనే పెళ్లి సందడి స్టార్ట్ కాబోతుంది. తన కూతురి మ్యారేజ్ కోసం ఆయన ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ ఫ్యామిలీని బండ్ల గణేష్ పర్సనల్గా కలిసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఇన్వైట్ చేశారు. శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన ప్రొడ్యూసర్, వాళ్ల ఫ్యామిలీతో కాసేపు సరదాగా టైమ్ స్పెండ్ చేశారు.

S.జానకి కోసం డల్లాస్లో స్పెషల్ ప్రోగ్రామ్!
అమెరికాలోని డల్లాస్లో లెజెండరీ సింగర్ S. జానకి కోసం ఒక స్పెషల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ చేశారు. DGIT, కళావాహిని కలిసి ఆర్గానైజ్ చేసిన ఈ ఈవెంట్లో అక్కడ ఉండే తెలుగు సింగర్స్ జానకమ్మ పాడిన ఫేమస్ సాంగ్స్ పాడి అందరినీ ఇంప్రెస్ చేశారు. 15 లాంగ్వేజెస్ లో 50 వేలకి పైగా పాటలు పాడి రికార్డ్ క్రియేట్ చేసిన ఆమె గ్రేట్నెస్ గురించి గుర్తుచేసుకున్నారు. ఫ్యూచర్ జనరేషన్కి తెలుగు మ్యూజిక్, కల్చర్ని పరిచయం చేయడానికే ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశామని ఆర్గానైజర్స్ చెప్పారు.
Job పోయింది.. అయినా Happy అంటున్నారేంటి?
జాబ్ పోతే టెన్షన్ పడాలి కదా... ఇక్కడ మాత్రం “హ్యాపీ!” అంటున్నారేంటి? మిలీనియల్స్ జాబ్స్ వదిలేయడం లేదా లేఆఫ్ అయిన తర్వాత కూడా హ్యాపీగా ఉన్నారంటూ ఓ వీడియో వైరల్ అయి సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ మొదలైంది. కార్పొరేట్ బర్నౌట్, వర్క్ ప్రెజర్, తక్కువ పే, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అంటూ చాలామంది తమ ఎక్స్పీరియన్స్లను షేర్ చేస్తున్నారు. మంచి శాలరీ ఒక్కటే లైఫ్ కాదని.. మెంటల్ పీస్ కూడా జాబ్ ప్యాకేజ్లో ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పులి దాడిలో మహిళ మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లాలో పులి దాడిలో ఓ మహిళ మృతిచెందింది. నిన్న తెల్లవారుజామున కన్హా నేషనల్ పార్క్ సర్కిల్లోని పర్రాపూర్ బైగటోలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సుగ్నీ బాయి ధుర్వే (30)పై పులి దాడి చేయడంతో ఆమె తలకు పెద్ద గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేస్ ఫైల్ చేసుకొని, ఫారెస్ట్ ఆఫీసర్స్తో కలిసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.