Latest

'ఐదు రూపాయల డాక్టర్' బయోపిక్ లో కయాదు లోహర్!
Cinema· 31 Jul 2026

'ఐదు రూపాయల డాక్టర్' బయోపిక్ లో కయాదు లోహర్!

స్టార్ హీరో సూర్య 48వ చిత్రంలో నటి కయాదు లోహర్‌ కీలక పాత్ర దక్కించుకుంది. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పేద రోగుల నుంచి రూ. 5 మాత్రమే ఫీజు తీసుకుని సేవలందించిన చెన్నైకి చెందిన ‘ఐదు రూపాయల డాక్టర్’ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కయాదు లోహర్ ప్రాధాన్యమున్న టీచర్ పాత్రలో కనిపించనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఒత్తిడిని చిత్తు చేసేద్దాం
Health· 31 Jul 2026

ఒత్తిడిని చిత్తు చేసేద్దాం

జీవితంలో పెండ్లి, పిల్లలు, ఆర్థిక సమస్యలు, కెరీర్ వంటి వివిధ విషయాలలో ప్రతిఒక్కరికీ ఆందోళన సహజం.నిజానికి ఆందోళన అనేది ఒత్తిడికి మన శరీరము, మనస్సు ఇచ్చే రియాక్షన్ అంతే! కొన్నిసార్లు ఇది మనం అలర్ట్‌గా ఉండటానికి, బాధ్యతగా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. కానీ పరిమితి దాటితే మాత్రం ప్రశాంతత పోతుంది. సరిగ్గా ప్లాన్ చేసుకోవడం, వర్కౌట్స్ చేయడం, మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉండటం, అలానే పెద్ద సమస్యలను చిన్న చిన్నగా విభజించి సాల్వ్ చేసుకోవడం చేస్తే ఒత్తిడిని ఈజీగా జయించవచ్చు.

ప్రధాని మోదీ మార్ఫింగ్ పోస్టులపై కేసు
Crime· 31 Jul 2026

ప్రధాని మోదీ మార్ఫింగ్ పోస్టులపై కేసు

TG: NEET పేపర్ లీక్ గొడవల టైమ్‌లో PM నరేంద్ర మోదీకి సంబంధించి మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై BJP మద్దతుదారులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు నడుపుతున్న వారితో పాటు మెటా ఇండియా హెడ్‌పై కూడా ఈ కేసులు పెట్టారు. ఆ వీడియోల లింకులు వెంటనే తీసేయాలని మెటా సంస్థకు పోలీసులు నోటీసులు పంపారు. ఆ పోస్టులు పెట్టిన వాళ్ల వివరాలు ఇవ్వాలని అడిగారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని అధికారులు చెప్పారు.

మాజీ BRS ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు
Crime· 31 Jul 2026

మాజీ BRS ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు

TG: మాజీ BRS ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన నుంచి డబ్బు తీసుకున్నాడని, తనకు తెలియకుండా వీడియోలు తీసాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాల్వలోకి దూసుకెళ్లిన RTC బస్సు
TG· 31 Jul 2026

కాల్వలోకి దూసుకెళ్లిన RTC బస్సు

AP: పల్నాడు జిల్లాలో RTC బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. విజయవాడ నుంచి వినుకొండకు వెళ్తున్న బస్సు ఫిరంగిపురం మండలం మేరికపూడి వద్ద ఈ ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురైనా, అదృష్టవశాత్తూ బస్సు బోల్తా పడకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, RTC అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో వినుకొండకు తరలించారు.

'మగధీర'కి 17 ఏళ్లు..
Cinema· 31 Jul 2026

'మగధీర'కి 17 ఏళ్లు..

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ చరణ్,కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ విడుదలైన నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2009 జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, తెలుగు సినిమాలో ఒక మైలురాయిగా నిలిచింది.మళ్ళీ జన్మల కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ విజువల్ మైండ్‌ బ్లోయింగ్ మూవీ చరణ్ రేంజ్‌ను పెంచడమే కాదు, రాజమౌళి విజన్ ఏంటో ప్రపంచానికి చూపించింది.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు `#17YearsForMagadheera` ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు.

అనాథ బాలికను చంపిన ఆటో డ్రైవర్
Crime· 31 Jul 2026

అనాథ బాలికను చంపిన ఆటో డ్రైవర్

AP: విశాఖ కంచరపాలెంకి చెందిన ఆటో డ్రైవర్ సురేష్, ఓ అనాథ బాలికను గర్భిణీగా ఉన్న తన భార్యకు సాయంగా ఉంటుందని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. సురేష్ భార్యకు పాప పుట్టాక, బాలిక తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఇద్దరి మధ్య గొడవ జరిగి కోపంతో ఆమెను కొట్టి చంపి శవాన్ని ట్రాలీ బ్యాగులో దాచి, రైలెక్కి ఒడిశా రాష్ట్రం రాయగడ దగ్గర ఎవరూ లేని చోట పడేశాడు. 3రోజుల తర్వాత వాసన రావడంతో స్థానికులు పోలీసులకు చెప్పారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఒడిశా పోలీసులు సురేష్‌ను పట్టుకున్నారు.

16 గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరం
TG· 31 Jul 2026

16 గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరం

TG: ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఆనంద్‌పూర్ వద్ద పెన్‌గంగా నది ఉద్ధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జిపై వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ–మహారాష్ట్ర మధ్య వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లోని దాదాపు 16 గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు ప్రకటించిన అధికారులు
Education· 31 Jul 2026

ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు ప్రకటించిన అధికారులు

AP: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రైవేటు స్కూళ్లకు అధికారులు ఈరోజు, రేపు సెలవులు ప్రకటించారు. రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఆ సభకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు స్కూల్ బస్సులను వాడనున్నారు. దీంతో రెండు రోజుల పాటు ఆ స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయని స్పష్టం చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌లోకి సత్యదేవ్ డార్క్ కామెడీ థ్రిల్లర్
Cinema· 31 Jul 2026

నెట్‌ఫ్లిక్స్‌లోకి సత్యదేవ్ డార్క్ కామెడీ థ్రిల్లర్

సత్యదేవ్ హీరోగా, వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావు బహదూర్’. జులై 3న థియేటర్లలో విడుదలై సైకాలజికల్ డార్క్ కామెడీతో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పరిమిత వసూళ్లను మాత్రమే సాధించింది.ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ లో ఈరోజు (జులై 31) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రసారం కానుంది. డిఫరెంట్ కంటెంట్, మిస్టరీ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు మాత్రం ఇది కచ్చితంగా నచ్చే చిత్రమవుతుంది.

లంక గ్రామాలకు రాకపోకలు బంద్
AP· 31 Jul 2026

లంక గ్రామాలకు రాకపోకలు బంద్

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక వద్ద వరద ఉధృతికి తాత్కాలిక మట్టి గట్టు కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఊడిమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపాలెం, గంటిపెదపూడి లంక గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యార్థులు, రైతులు, అత్యవసర అవసరాల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలు తగ్గే వరకు నాటు పడవలే ఏకైక రవాణా మార్గంగా మారాయి.

ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ మోసం
Crime· 31 Jul 2026

ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ మోసం

ప్రధాని స్కాలర్షిప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలు చేస్తున్నారు. మీ అకౌంట్లో రూ.38,500 వేశామని, ఆ డబ్బులు మీకు రావాలంటే ముందు ఫోన్ పే ద్వారా రూ.5 వేలు పంపాలని అడుగుతున్నారు. ఇలాంటి కాల్స్ అస్సలు నమ్మకండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్కాలర్షిప్ డబ్బులు నేరుగా బ్యాంకు అకౌంట్లో పడతాయి కానీ, అధికారులు ఎప్పుడూ ఫోన్ చేసి డబ్బులు అడగరు. మీ ఫోన్ పే లేదా బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పకండి అని పోలీసులు సూచిస్తున్నారు.

గణేష్ విగ్రహాల తయారీపై సజ్జనర్ కీలక ఆదేశాలు
News· 31 Jul 2026

గణేష్ విగ్రహాల తయారీపై సజ్జనర్ కీలక ఆదేశాలు

TG: గణేష్ ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించేందుకు నగర పోలీసు కమిషనర్ సజ్జనర్ విగ్రహ తయారీదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వారితో చర్చించారు. గత ఏడాది గణేష్ విగ్రహాల రవాణా సమయంలో నాలుగు ప్రమాదాలు జరిగినట్లు గుర్తు చేశారు. ఈసారి అలంటి ప్రమాదాలు జరగకుండా గణేష్ విగ్రహాల ఎత్తును 16 అడుగులకు మించరాదని తయారుదారులకు సజ్జనర్ సూచించారు.

డేటింగ్ యాప్స్ తో HIV ముప్పు
News· 31 Jul 2026

డేటింగ్ యాప్స్ తో HIV ముప్పు

ఒక ఉమెన్ గైనకాలజిస్ట్ యువతకు షాకింగ్ నిజం చెప్పారు. డేటింగ్ యాప్స్ ద్వారా ఏర్పడే పరిచయాలతో చాలామంది యువత HIV, STD (సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్) లాంటి ప్రాణాంతక రోగాలు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా 19, 20 ఏళ్ల అమ్మాయిలు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లతో హాస్పిటల్ కు వస్తున్నారట. కాసేపు ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆమె చెప్పారు.

భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య
Crime· 31 Jul 2026

భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య

TG: ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న మంచాల మండలం నోముల గ్రామంలో బాబు అనే వ్యక్తి ఫిబ్రవరి 24, 2026న తన భార్యను దారుణంగా చంపేశాడు. ఆ రోజు నుంచి అతడు ఊరికి దూరంగా ఉంటున్నాడు. అయితే, గురువారం రాత్రి తన భార్య సమాధి పక్కనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. భార్యను చంపిన అతడే ఆమె సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకోవడం స్థానికులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

250 రోజుల్లో ‘వారణాసి’.. ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తారా?
Cinema· 31 Jul 2026

250 రోజుల్లో ‘వారణాసి’.. ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తారా?

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్‌కు సరిగ్గా మరో 250 రోజుల సమయం మాత్రమే ఉండటంతో,అనుకున్న తేదీకే విడుదల చేసి ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తారో లేదో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాలుగోసారి ఇన్‌స్టాగ్రామ్ వీడియోతో ప్రధాని మోదీ
Politics· 31 Jul 2026

నాలుగోసారి ఇన్‌స్టాగ్రామ్ వీడియోతో ప్రధాని మోదీ

పేపర్ లీక్స్, విద్యా వ్యవస్థను బలోపేతం చేసే సమస్యలపై పీఎం నరేంద్ర మోదీ వారం రోజుల్లో నాలుగోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లు, 2026ను ప్రశంసించారు. లీక్‌లకు లీక్‌లకు శిక్షలను పెంచడం వంటి కేసులను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్షా వ్యవస్థను విశ్వసనీయంగా మార్చడంలో దీని ఆమోదం ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయనన్నారు.

రైలెక్కేలోపే నిందితురాలికి షాక్
Crime· 31 Jul 2026

రైలెక్కేలోపే నిందితురాలికి షాక్

TG: కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రూ.26 లక్షల చోరీ కేసులో మరో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తగరం శంకర్‌ను నిన్న అరెస్ట్ చేయగా, ఆయన సన్నిహితురాలు ఆడెపు రేష్మాను తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చోరీ చేసినట్లు అంగీకరించింది. శంకర్‌తో కలిసి ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించి బాత్రూమ్‌లో దాచిన రూ.26 లక్షల నగదును దొంగిలించినట్లు ఒప్పుకుంది. పరార్ అయ్యేందుకు రైలు కోసం వేచి ఉండగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

‘స్పైడర్ మ్యాన్‌’కు తొలిరోజు భారీ కలెక్షన్లు!
Cinema· 31 Jul 2026

‘స్పైడర్ మ్యాన్‌’కు తొలిరోజు భారీ కలెక్షన్లు!

టామ్ హాలండ్ కథానాయకుడిగా నటించిన ‘స్పైడర్ మ్యాన్‌- బ్రాండ్ న్యూ డే’ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రికార్డు సృష్టించింది. మొదటి రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏకంగా ₹72.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk తెలిపింది. ఇందులో ఇంగ్లిష్ వెర్షన్ ₹32.25 కోట్లు, హిందీ వెర్షన్ ₹22 కోట్లు రాబట్టాయి. దీంతో మన దేశంలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. గతంలో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సాధించిన ₹65 కోట్ల రికార్డును దాటేసింది.

మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రికార్డ్!
Cinema· 31 Jul 2026

మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రికార్డ్!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రం థియేటర్లలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2026 సంక్రాంతి (జనవరి 12) విడుదలైన ఈ సినిమా, కడప జిల్లా యర్రగుంట్ల లోని 'హేమ పిక్చర్ ప్యాలెస్' లో విజయవంతంగా 200 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు త్వరగా ఓటీటీ బాట పడుతున్న రోజుల్లో కూడా, ఈ చిత్రం ఇప్పటికీ రోజూ 4 ఆటలతో నడుస్తూ బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

జిల్లా మైనింగ్ AD సస్పెండ్
AP· 31 Jul 2026

జిల్లా మైనింగ్ AD సస్పెండ్

AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) మజ్జి శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ పురుషోత్తంకు బాధ్యతలు అప్పగించారు. అక్రమ క్వారీ అనుమతులపై విచారణ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తవ్వకాల అనుమతులను రద్దు చేసి, పంచదార్లను 'నో మైనింగ్ జోన్'గా చర్యలు చేపట్టాలని డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.