Latest

అరెస్ట్ చేస్తారా? చెయ్యండి- CJP స్పోక్స్ పర్సన్
రాజస్థాన్ ప్రభుత్వ స్కూళ్ల కండిషన్పై వాయిస్ రైజ్ చేస్తున్న CJP స్పోక్స్ పర్సన్ <a href="https://x.com/AshutoshRanka/status/2092199495174082720?s=20">అశుతోష్ రాంకా</a>, తన ఇంటి ముందు రాజస్థాన్ పోలీసులు నిఘా పెట్టడంపై 'X' వేదికగా స్పందించారు. రాజస్థాన్ పోలీసులు ధైర్యంగా వచ్చి తనను అరెస్ట్ చేసుకోవచ్చని, అంతేకానీ ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి మెరుగుపడే వరకు తమ టీమ్ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

జల్ జీవన్ మిషన్ కాంట్రాక్టర్ల నిరసన
AP : అమరావతిలో జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పనులు చేసిన కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బిల్లుల కోసం మంగళగిరిలో నిరసన తెలిపారు. 2024 నవంబర్ నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్లో ఉన్న రూ.4,133 కోట్ల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్య తీరేవరకు ఈ ఆందోళనను ఇలాగే కొనసాగిస్తామని అన్నారు.

గ్రూపు రాజకీయాలు వద్దు.. అభివృద్ధి కావాలి
TG : వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు గ్రూపు రాజకీయాలు పక్కనబెట్టి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆక్టివిస్ట్ డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ కోరారు. ‘మాకు మీ గ్రూపు రాజకీయాలు వద్దు.. అభివృద్ధి కావాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, వైద్యం అందాలి. గొడవలు లేకుండా రక్షణగా ఉండాలి’ అని ఆయన ప్లకార్డులతో డిమాండ్ చేశారు. లీడర్లు ప్రజల అవసరాలను గుర్తించి ఏరియా డెవలప్మెంట్ కోసం కష్టపడాలని అన్నారు.

మారుతున్న గవర్నమెంట్ స్కూళ్లు?
UP యోగి ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్కు రూ.604 కోట్ల బడ్జెట్ను అప్రూవ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,126 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పాతబడిన క్లాస్రూమ్లను రీబిల్డ్ చేసి, మోడర్న్ ఫెసిలిటీస్ కల్పించడమే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఎయిమ్. పనులు వెంటనే స్టార్ట్ అయ్యేలా బేసిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా రూ.302 కోట్లను ఆల్రెడీ రిలీజ్ చేసింది. దీనివల్ల స్టూడెంట్స్ కు సేఫ్ అండ్ బెటర్ లెర్నింగ్ స్పేస్ అందుబాటులోకి రానుంది.

కార్గో ఎయిర్పోర్ట్ వద్దు
AP : శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్దానాన్ని నాశనం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను క్యాన్సిల్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 8న అన్ని గ్రామాల్లో కళ్లకు గంతలు కట్టుకుని నిరసనలు తెలపాలని పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కమిటీ ప్రెసిడెంట్ కొమర వాసు, సెక్రటరీ జోగి అప్పారావు ఆధ్వర్యంలో పలాసలో మీటింగ్ జరిగింది. ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్స్ తీసుకుంటే రైతులు, కూలీలు ఉపాధి కోల్పోతారని నేతలు భయపడుతున్నారు. భూముల జోలికి వస్తే తిరుగుబాటు తప్పదని ప్రజా సంఘాలు, నాయకులు హెచ్చరించారు.

రక్షా బంధన్ యాడ్పై కృతి సనన్ క్లారిటీ.. ఏమన్నారంటే?
కృతి సనన్ రక్షా బంధన్ యాడ్పై వచ్చిన విమర్శలకు రెస్పాండ్ అయ్యారు. యాడ్లో తన బట్టలపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేయగా, కంగనా రనౌత్ కూడా విమర్శలు చేశారు. దీనిపై కృతి మాట్లాడుతూ.. పండుగల స్ఫూర్తి వేసుకునే బట్టల్లో కాదు, మనసులోని భావాలు, బంధాలు, సంప్రదాయాల్లో ఉంటాయని కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఏం ధరించాలనే విషయంపై సమాజం ఎప్పుడూ సూచనలు చేస్తుందని ప్రశ్నించారు.

పాలిటెక్నిక్లో స్పాట్ కౌన్సిలింగ్
AP :పల్నాడు జిల్లా గురజాలలో 'ఆచార్య N.G. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం' లో 'Diploma in Seed Technology' కోర్సులో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 27న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. 10వ తరగతి పాసైన వారు, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దీనికి అర్హులేనని ప్రిన్సిపాల్ డాక్టర్ వి. సైదానాయక్ తెలిపారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కృష్ణా ఆడిటోరియంలో ఉదయం 9:30 గంటలకు ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా హాజరై ఈ ఛాన్స్ వాడుకోవచ్చని తెలిపారు.

ఫేక్ ST సర్టిఫికెట్లపై NCSTకి ఫిర్యాదు
TG : ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, చింతకాని, తిరుమలాయపాలెం మండలాల్లో కొందరు BC(A) రాజన్న కులానికి చెందిన వారు అక్రమంగా ST (రాజకోయ) సర్టిఫికెట్లు పొంది రిజర్వేషన్లు వాడుకుంటున్నారని ఆదివాసి సంఘాలు ఆరోపించాయి. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో జాతీయ ST కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్కు ఆదివాసి పొలిటికల్ JAC కన్వీనర్ వాసం రామకృష్ణ వినతిపత్రం ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లను రద్దు చేసి, ఇచ్చిన తహసీల్దార్లపై కేసులు పెట్టాలని కోరగా, కమిషన్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. Govt.కు కోర్టు ఆదేశం
AP: 16 రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మెకు తెరపడింది. సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు హైకోర్టుకు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ డిమాండ్లపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జూనియర్ డాక్టర్ల సమ్మెను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల సంఘానికి కోర్టు నిన్న నోటీసులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో నిలిచిపోయిన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి

అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
TG : ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన స్టూడెంట్స్పై పోలీసులు పెల్లెట్ గన్స్తో దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహబూబాబాద్లో యూత్ కాంగ్రెస్ లీడర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టారు. 19 ఏళ్ల స్టూడెంట్ కంటిచూపు కోల్పోవడం చాలా దారుణమని, దీనికి బాధ్యత వహిస్తూ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజ్మీర సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిరెడ్డి, శివచరణ్ రెడ్డి పిలుపు మేరకు ఈ ప్రోగ్రామ్ జరిగింది.
వైర్లు కిందకు వేలాడుతున్నాయని హైవే బంద్
AP : అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామం వద్ద హైవేపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. హైవేపై 132 KV కరెంట్ వైర్లు కిందకు వేలాడుతుండటంతో పెద్ద వాహనాలకు ముప్పు ఉందని రాకపోకలు ఆపేశారు. చించినాడ బ్రిడ్జ్ వర్క్ జరిగినప్పుడే ఈ వైర్ల పనులు పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ప్రస్తుతం ఒక రోడ్ క్రాసింగ్ టవర్ పిల్లర్ పని పూర్తయింది. మిగతా టవర్ వర్క్ కూడా త్వరగా పూర్తిచేయాలనీ డిమాండ్ చేశారు.

కృతి సనన్ రాఖీ యాడ్పై దుమారం.. కంగనా షాకింగ్ కామెంట్స్
కృతి సనన్ నటించిన రక్షా బంధన్ యాడ్పై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కోసం చేసిన ఈ యాడ్లో కృతి వేసుకున్న బట్టలపై కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ ఫెస్టివల్ను ఇలా చూపించడం సరికాదని విమర్శించారు. దీనిపై బీజేపీ MP, నటి కంగనా రనౌత్ స్పందించారు. రాఖీ కట్టేందుకు బికినీ వేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ.. యాడ్ చాలా అసహ్యంగా ఉందని విమర్శించారు. ఈ వివాదంపై కృతి ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు.
1000 స్కూల్స్ లిస్ట్ ఇవ్వండి.. కేజ్రీవాల్ సవాల్!
పంజాబ్లోని ప్రభుత్వ స్కూళ్లపై BJP చేస్తున్న విమర్శలపై AAP కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. గుజరాత్లో 30 ఏళ్ల BJP పాలన, పంజాబ్లో 4-1/2 ఏళ్ల AAP పాలనలోని స్కూళ్లను పోల్చి చూద్దామని ఛాలెంజ్ చేశారు. పంజాబ్ నుండి 1,000 స్కూళ్లు, గుజరాత్ నుండి 1,000 స్కూళ్ల లిస్ట్ తీసుకొని స్వయంగా ఇన్స్పెక్షన్ చేసి ఏవి బెటర్గా ఉన్నాయో తేలుద్దామన్నారు. పంజాబ్ విద్యా వ్యవస్థను BJP కావాలనే బద్నామ్ చేస్తోందని మండిపడ్డారు.

KGBV హాస్టల్లో ‘వన మహోత్సవం’
TG : కొమురం భీం జిల్లా గంగాపూర్ KGBV హాస్టల్లో వన మహోత్సవం ఘనంగా జరిగింది. 'వనం ఉంటేనే జీవనం' అనే నినాదంతో Students, Officers కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడటం, పచ్చదనం పెంచడం, కాలుష్యాన్ని తగ్గించి వర్షాలు పడేలా చూడటమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. అడవుల నరికివేతను ఆపేందుకు 1950లోనే అప్పటి కేంద్ర మంత్రి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంగాపూర్ సర్పంచ్ వెంకటేశం చారి, KGBV టీచర్లు, Students పాల్గొన్నారు.

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు: అలహాబాద్ కోర్టు
ప్రయాగ్రాజ్కు చెందిన ఓ స్టూడెంట్ స్కూల్ యూనిఫాంతోపాటు హిజాబ్ వేసుకునేందుకు పర్మిషన్ కోరుతూ వేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ఇస్లామిక్ సంప్రదాయంలో అతి ముఖ్యమైనది కాదని, అది తప్పనిసరి మతాచారం కాదని జస్టిస్ జె.జె.మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాల ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. స్కూల్ యూనిఫాం రూల్స్ అందరికీ సమానంగా వర్తించాలని, వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా మార్చే హక్కు విద్యార్థులకు లేదని తేల్చి చెప్పింది. యూనిఫాంకు అదనంగా ఏదైనా జోడిస్తే డిసిప్లిన్ దెబ్బతింటుందంది.
రోడ్డు కోసం గ్రామస్థుల ఆందోళన
TG: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో సుమారు 30 మీటర్ల రహదారి పనులు పూర్తికాకపోవడంతో గ్రామస్థులు ధర్నాకు దిగారు. రెండు గంటలపాటు ఆందోళన చేసినా గ్రామ సర్పంచ్ సమస్య పరిష్కారానికి హాజరుకాకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లలో గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని తెలిపారు. అధికార పార్టీ, ఎమ్మెల్యే, ప్రభుత్వం ఉన్నా చిన్న సమస్య పరిష్కారానికి ప్రజలు ధర్నా చేయాల్సి రావడం బాధాకరమన్నారు. పోలీసులు వచ్చి ధర్నా విరమింపజేశారని వార్డు సభ్యుడు బక్కి శివకృష్ణ తెలిపారు.

చెన్నారావుపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
TG: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
TG: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 5వ డివిజన్లోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన మొక్కలతో వనమహోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్, కమిషనర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మొక్కలు నాటారు.

వెంకటాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
TG: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్మార్ట్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ ఇంగోలి రాజేశ్వరరావు, ఉపసర్పంచ్ మార్కెట్ రవి, వార్డు సభ్యులు, అధికారులు, కార్డుదారులు పాల్గొన్నారు.

‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. షనాయా కపూర్ ఎంట్రీ
‘జాంబీ రెడ్డి 2 NXT LVL’ టైటిల్ను మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. తేజ సజ్జ మరోసారి హీరోగా కనిపించనున్నారు. హైదరాబాద్లో జాంబీలు విజృంభించే కథతో సీక్వెల్ సాగనుంది. కన్నడ స్టార్ ఉపేంద్ర మెయిన్ రోల్ లో నటించనుండగా.. షనాయా కపూర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. సుపర్ణ్ S. వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. 2027లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

గ్యాస్ కోసం గిరిజన మహిళల అవస్థలు
AP: అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని గిరిజన గ్రామాల మహిళలు గ్యాస్ సిలిండర్ల కోసం పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. చీమలపాడు పంచాయతీ పరిధిలోని జెడ్. జోగంపేటలో గ్యాస్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 10కి పైగా గ్రామాల మహిళలు కోరారు. ప్రస్తుతం సిలిండర్ల కోసం సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని చీమలపాడు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు బంధాలు, కడగడ్డ, అజయ్పురం, జెడ్. జోగంపేట, గంగంపేట, నేరేడు బంధం తదితర గ్రామాల్లో 174 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు.