← Back to news

భార్యను చంపి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

By dk yamjala· 4 Jun 2026· Eenadu· హైదరాబాద్‌
భార్యను చంపి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

TG: కుటుంబ కలహాలతో భర్త భార్యపై కత్తితో దాడిచేసి చంపాడు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కైతలాపూర్‌ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న ఆస్మరా బేగం(24), షేక్ రహీంలకు 2024లో పెళ్లి అయింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. మ్యారేజ్ అయినప్పటి నుంచి వీరికి గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై గతంలో దంపతులిద్దరూ వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం వారి మధ్య గొడవ జరగడంతో రహీం కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. అనంతరం డైరెక్ట్‌గా రహీం స్థానిక PSలో లొంగిపోయాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.