సింగరేణి ఉద్యోగులను వేధించడం అమానుషం: కల్వకుంట్ల కవిత

TG: సింగరేణి సింగరేణి ఉద్యోగులను వేధించడం అమానుషం అని మాజీ ఎంపీ కవిత అన్నారు. 2016, 2017 JMET ద్వారా ఉద్యోగంలో చేరిన 800 మంది ఉద్యోగులకు 2023 వరకు ఓవర్ మెన్గా ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ 200 మందికే ప్రమోషన్స్ ఇచ్చి 600 మందిని పక్కనపెట్టడం అన్యాయమని అన్నారు. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే బదిలీల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. డిమాండ్ల పరిష్కారం కోసం కొత్తగూడెంలో చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షకు తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.



