అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

TG: హైదరాబాద్ గచ్చిబౌలి ORR వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్రామ్గూడ వైపు వెళ్తున్న తవేరా కారు అదుపుతప్పి నియోపోలీస్ బ్రిడ్జి పిల్లర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఇద్దరు టైల్స్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రాజస్థాన్కు చెందిన కనైయాలాల్ (25), దేరామ్ (24)గా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



