హత్యకు అరగంట ముందే ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!

పుణె బిజినెస్మెన్ కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నవంబర్లో పెళ్లి ఇష్టం లేక సియా గోయల్, జూన్ 18న కేతన్ను కొండపై నుంచి తోసి చంపేసింది. హత్యకు అరగంట ముందు ఆమె తన ప్రియుడు చేతన్తో సీక్రెట్ కాల్ మాట్లాడినట్లు సీడీఆర్ (CDR) ద్వారా పోలీసులు కనుగొన్నారు. కేతన్ ఉన్న లొకేషన్ను ప్రియుడికి చెప్పడానికే ఈ కాల్ చేసింది. డిజిటల్ ఎవిడెన్స్ దాచడానికి వీరిద్దరూ 3 నెలల సోషల్ మీడియా చాట్స్ కూడా డిలీట్ చేశారు.



