← Back to news

ఐదు కుటుంబాల కుల బహిష్కరణ

By K. RAJASHEKAR· 25 Aug 2026· Kamareddy
ఐదు కుటుంబాల కుల బహిష్కరణ

TG: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండాలో భూవివాదం నేపథ్యంలో ఐదు కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమతో ఎవరైనా మాట్లాడితే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారని, తిరిగి కులంలో చేర్చుకునేందుకు ఒక్కో కుటుంబం రూ. 1 లక్ష చొప్పున మొత్తం రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారన్నారు. పండుగల సందర్భంగా ఆలయానికి కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

More in Local