E-Commerce కొనుగోళ్లకు భరోసా.. నకిలీ ఆఫర్లకు చెక్!

ఆన్లైన్ షాపింగ్లో వినియోగదారులను మోసం చేసే విధానాలకు కేంద్రం చెక్ పెట్టింది. ఇ-కామర్స్ రూల్స్ను సవరిస్తూ కొత్త రూల్స్ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై డిస్కౌంట్ ప్రకటిస్తే గత 30 రోజుల్లో అమ్మిన అత్యల్ప ధరను కూడా చూపించాలి. సెర్చ్ ఫలితాలను తారుమారు చేయడం, స్పాన్సర్డ్ లిస్టింగ్స్ను దాచడం వంటి వాటిపై రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. రిటర్న్, రిఫండ్, వారంటీ, డెలివరీ ఛార్జీలు, ఎక్స్పైరీ డేట్ లాంటి వివరాలను కొనుగోలుకు ముందే వెల్లడించాలి.


