సిగ్నల్స్ కోసం టెక్నీషియన్ని టవర్కి కట్టేసారు!
UPలోని ఫతేపూర్ జిల్లా హర్దౌలిలో రెండేళ్లుగా 5G నెట్వర్క్ రావడం లేదని కోపంతో ఉన్న గ్రామస్తులు.. ఓ ప్రైవేట్ టెలికం టెక్నీషియన్ను మొబైల్ టవర్కే కట్టేశారు. భారీగా రీఛార్జ్ ఫీజులు కడుతున్నా సరిగా ఇంటర్నెట్, కాల్స్ రావట్లేదనీ, హయ్యర్ అఫీషియల్స్ వచ్చి సమస్య తీర్చేవరకూ వదిలేది లేదని అతన్ని 2 గంటల పాటు కట్టేశారు. స్పాట్కి చేరుకున్న పోలీసులు టెక్నీషియన్ను విడిపించి, అతని కంప్లైంట్ మేరకు BNSS సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు.



