బుల్లెట్ ట్రైన్ పై జపాన్ మాజీ మంత్రి కామెంట్స్ ను ఖండించిన కేంద్రం !

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆలస్యానికి భారత అధికారుల వైఖరే కారణ మంటూ జపాన్ మాజీ మంత్రి హిడెకి మాకిహారా చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. చర్చల సమయంలో భారత అధికారులు రూల్స్ పాటించకుండా స్వార్థపూ రితంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. అయితే, ఈ వాదనలను తోసిపుచ్చిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. న్యూఢిల్లీ-టోక్యో మధ్య చర్చలు బానే సాగుతున్నాయని, ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చింది.



