చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వాచ్మన్ అరెస్ట్

TG: మేడ్చల్ జిల్లా అల్వాల్ PS పరిధిలో నివాసం ఉంటున్న మేదిశెట్టి శ్యామ్రావు తమ ఇంటికి తాళం వేసి మెదక్కు వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిచేస్తున్న కొల్లి లోవరాజు(38) ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి.. సుమారు రూ.20 లక్షల విలువైన 13.4 తులాల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.



